సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న..SR కల్యాణ మండపం EST 1975.. ట్రైలర్!

రాజావారు రాణిగారు ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా, టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీధర్ గాదె తెరకెక్కించిన చిత్రం “SR కల్యాణ మండపం EST 1975”.. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అన్ని రకాల ప్రేక్షకులలో సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార, సిగ్గేంద‌కు రా మావ‌ వంటి పాట‌లు మిలియన్ వ్యూస్ సాధించి విశేష ఆదరణను దక్కించుకున్నాయి. ఇక ఈ పాటలతో పాటు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న SR కళ్యాణమండపం ఆగస్టు 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని ఇదివరకే చిత్రబృందం ప్రకటించారు.ఈ క్రమంలోని ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హైదరాబాద్ లోని హైద‌రాబాద్ ఏ ఎమ్ బి మ‌ల్టీప్లేక్స్ థియేట‌ర్ లో అంగ‌రంగ వైభవంగా జరిగింది.

ఈ క్రమంలోనే సీనియర్ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తనకు పోలీస్ స్టోరీ, ప్రస్థానం చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఆ రెండు సినిమాల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ సినిమా అంతే గుర్తింపును సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఆదరించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను సాయికుమార్ కోరారు.