రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి_ నారా లోకేష్

గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లకు అయిన న్యాయం జరిగిందా అని లోకేష్ ప్రశ్నించారు.

సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం జగన్.. మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని లోకేష్ మండిపడ్డారు. సీఎం ఇంటి పక్కన సొంత నియోజకవర్గంలో అత్యాచారాలు జరిగితే.. ఇంతవరకు నిందితుల్ని పట్టుకోలేక పోవడం జగన్ చేతకాని తనానికి నిదర్శనమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.