Mahesh Babu: తల్లిదండ్రులు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. తనతల్లిదండ్రితో పాటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అన్నయ్య కూడా మరణించడం మహేష్ బాబుని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఈ విధంగా మహేష్ బాబు ఈ ఏడాదిలో ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఏడాది మొదట్లో మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణించారు.

Mahesh Babu: నటిస్తావా అని అడిగినందుకు మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు: కృష్ణ

ఇక సెప్టెంబర్ చివరి వారంలో మహేష్ తల్లి చనిపోగా నవంబర్ రెండవ వారంలో కృష్ణ మరణించారు. ఇలా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కృష్ణ ఇందిరా దేవి వారసుడిగా మహేష్ తన తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలన్నింటిని పూర్తి చేశారు.సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వారికి కర్మకాండలు చేసిన వారు తప్పనిసరిగా తలనీలాలు తీయించుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తల్లి అలాగే తన తండ్రికి కూడా వారసుడిగా కర్మకాండలను పూర్తిచేసిన గుండు మాత్రం తీయించుకోలేదు. ఈ క్రమంలోని ఇందుకు గల కారణాలు ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి కారణం తన అప్ కమింగ్ సినిమాలు అని మాత్రమే తెలుస్తుంది.

Mahesh Babu: సినిమాల కారణంగానే తలనీలాలు తీయలేదా…

ఇప్పటికే మహేష్ బాబు తల్లి మరణించడంతో తన సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తన తలనీలాలు కనుక తీసివేస్తే మహేష్ బాబు ఆ లుక్ రావడానికి మరింత ఆలస్యం అవుతుందని అదేవిధంగా మహేష్ బాబు హెయిర్ రియల్ హెయిర్ కాదు. సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల ఈయన తలనీలాలు ఇవ్వలేదని సమాచారం.