Chiranjeevi: కోట్లు సంపాదించిన నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే… చిరంజీవి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు ఎంతో పోటీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఇటీవల సోషల్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవితో పాటు నటుడు విజయ్ దేవరకొండ కూడా హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తమ మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చిరంజీవి నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పది సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి గానే ఉంటాను ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు షాంపూ అయిపోతే ఆ బాటిల్ నీళ్లు వేసుకొని షాంపూ చేసుకుంటాను ఇలా మీలో కూడా ఏదైనా మిడిల్ క్లాస్ లక్షణాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ ఆ షాంపు బాటిల్ లోకి నీళ్లు పోసుకుని చాలాసార్లు షాంపు చేసుకున్నాను అంటూ ఈయన కూడా తన మిడిల్ క్లాస్ లక్షణాలను బయటపెట్టారు. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడ ఏ లైట్ ఆన్ లో ఉన్న నేను వాటన్నింటిని ఆఫ్ చేస్తూ ఉంటాను. ఇక చరణ్ ఏదైనా వెకేషన్ వెళితే తన ఫ్లోర్లో కనీసం రెండు మూడు లైట్లు అలాగే వెలుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ నేనే ఆపి వేస్తాను.

పొదుపు అవసరం…
కేవలం లైట్లు మాత్రమే కాకుండా ఇంట్లో ఎక్కడైతే గ్లీజర్స్ ఆన్ లో ఉంటాయి లేదంటే ఫాన్స్ ఆన్ లో ఉంటాయో వాటి అన్నింటిని ఆన్ ఆఫ్ చేయడానికి నా మొబైల్లో ఒక యాప్ ఉందని ఆ యాప్ ద్వారా అన్నింటిని చెక్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటానని తెలిపారు. నేను ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి విషయాలలో మిడిల్ క్లాస్ వ్యక్తిగానే ఆలోచిస్తానని పొదుపు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అంటూ చిరు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.