AP Election Result: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే… మాజీ మంత్రి రావెల కిషోర్ కామెంట్స్!

AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రజలు ఎవరూ కూడా సరైన స్థాయిలో అవగాహన లేరని చెప్పాలి. ప్రజలను కూడా అయోమయానికి గురి చేసే విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నాయి కానీ ప్రజలందరూ కూడా ఈసారి మాత్రం వైసిపి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కూటమి నేతలు కూడా ఈసారి తామే అధికారంలోకి రాబోతున్నామని ప్రమాణస్వీకారానికి తేదీలు కూడా ఖరారు చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నామని తెలియజేశారు. కానీ జూన్ 4వ తేదీ అసలైన ఫలితాలు వెలబడునున్నాయి. ఇలాంటి తరుణంలో టిడిపి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి రావెల కిషోర్ ఇటీవల టిడిపికి గుడ్ బై చెబుతూ వైసిపి గూటికి చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కాబోతున్నారని 70% ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఎన్నికలలో ప్రజాతీర్పును టిడిపి గౌరవించాలని ఈయన కోరారు.

రెండోసారీ ముఖ్యమంత్రిగా జగన్..
ఈ విధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఈయన ఇప్పుడు మాత్రం వైసిపి అధికారంలోకి రావాలని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈసారి ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.