Keeravani: రామోజీ సంస్కరణ సభ… జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన కీరవాణి!

Keeravani: రామోజీరావు పరిచయం అవసరం లేని పేరు. రామోజీ సమస్యల గ్రూప్ అధినేతగా ఎన్నో వ్యాపారాలను నిర్వహిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రామోజీరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఈయనకు ఘన నివాళులు అర్పించారు.

ఇలా రామోజీరావు మరణించడంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం విజయవాడలో ఆయన సంస్కరణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు అలాగే రామోజీ కుటుంబ సభ్యులకు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ జగన్ పరిపాలనపై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. తాను గతంలో బ్రతికితే రామోజీరావు గారి లాగా బ్రతకాలి అని ఇప్పుడు మరణిస్తే ఆయనలాగే మరణించాలని కీరవాణి తెలిపారు..ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేవరకు ఆపుకొని తానే మరణించాడు.

మా దేవుడి గదిలో రామోజీ ఫోటో..
అదే విధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ ని కబంధ హస్తాల నుంచి బయటపడటం ఆయన కళ్లారా చూసి అప్పుడు ఆయన నిష్క్రమించారు. అందుకే మరణిస్తే ఆయనలాగే మరణించాలని తెలిపారు. ఇక ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆయన దేవుడిని నమ్మరు కానీ అలాంటి వ్యక్తి ఫోటో మా ఇంట్లో దేవుని గదిలో ఉందని తెలిపారు. ఇక ఈ విషయంపై పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు సంస్కరణ సభకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.