Nagashaurya-Anusha Shetty: వెండి కంచాల్లో.. రాచరికపు స్టైల్ లో నాగశౌర్య పెళ్లి భోజనాలు.. ఫోటోలు వైరల్!

Nagashaurya-Anusha Shetty: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం ఉదయం 11:25 గంటలకు నాగశౌర్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

3

ఈ క్రమంలోనే నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన హల్దీ, సంగీత్, పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చెక్కర్లు కొట్టడంతో పెద్ద ఎత్తున అభిమానులు, నేటిజన్ లు నాగశౌర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య పెళ్లిలో వడ్డించిన భోజనాలకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

నాగశౌర్య తండ్రి ఓ ప్రముఖ వ్యాపారవేత్త. వందల కోట్ల కు నాగశౌర్య వారసుడు అదేవిధంగా అనూష శెట్టి సైతం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావడంతో వీరి పెళ్లికూడా అంతే ఘనంగా నిర్వహించారు. అలాగే వీరి పెళ్లిలో భోజనాలను రాచరికపు స్టైల్ లో వడ్డించారని తెలుస్తోంది.

12 రకాల వంటకాలతో విందు..

వెండికంచాలలో సుమారు 12 రకాల వంటకాలతో పెళ్లికి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం నాగశౌర్య పెళ్లిలో విందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగ శౌర్య బెంగుళూరులో వివాహం చేసుకోగా త్వరలోనే హైదరాబాదులో సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించి వారందరికీ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెలువబడునుంది.