తెలంగాణ కర్ఫ్యూ నుంచి వీరికి మినహాయింపు..!

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాత్రి కర్వ్యూ పెట్టిన ప్రభుత్వం కొందరికి మినహాయింపు ఇచ్చింది.

వీరిలో ప్రయాణికులు విమాశ్రయాలకు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ లకు వెళ్ళొచ్చు. అయితే దానికి తగిన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్ళేవారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే మరియు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సులు, సరుకు వాహనాలకు అనుమతిచ్చింది. వాటికి ఎలాంటి పాసులు అవసరం స్పష్టం చేసింది ప్రభుత్వం.