పవన్ నియోజక వర్గం భీమవరంపై.. పూనమ్ హాట్ కామెంట్స్..!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు చాలామంది అతడి వెన్నంటే ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతడిపై టార్గెట్ చేసి మరీ మాటల బాంబులు పేలుస్తున్నారు కొంతమంది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఇలానే అతడిపై వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయితేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి.

రాజకీయంగా చాలామంది ఆ విషయాలపై మాట్లాడారు. ఇలా చాలాకాలం తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మళ్లీ మాటల యుద్ధాలు మొదలయ్యాయి. పోసాని అయితే ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించాడు. దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పోసాని పంజాబీ అమ్మాయి అని పూనమ్ కౌర్ ను పరోక్షకంగా ప్రస్తావించి.. ఆమెను మోసం చేశాడని పేర్కొనగా అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అప్పటి నుంచి పూనమ్ కౌర్ పై పవన్ కి లింక్ పెట్టి కూడా పలు ట్రోల్స్ ఇప్పటికీ నడుస్తాయి. తాజాగా పూనమ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే.. పవన్ కళ్యాణ్ వైపే పూనమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందంటే.. ఇటీవల అంతర్జాతీయంగా రాజకీయాలపై ఓ సర్వే నిర్వహించారు. దానిలో ఏ రాష్ట్రంలో సిట్టింగ్ నేతలు ఆ పార్టీల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా ఆమె ఏపీ గట్టిగానే ఉంది అంటూ ట్వీట్ చేసింది.

దానికి పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని టాగ్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె దీనిని ఏ కోణంలో ట్వీట్ చేశారో తెలియదు కానీ.. పవన్ అభిమానులు మాత్రం ఈ ట్వీట్ తో ప్రతి ఒక్కరికీ క్లారిటీ వచ్చినట్టేగా అని అంటున్నారు. ఈ ట్వీట్ తో పవన్ కు ఆమె సపోర్ట్ గా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.