Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

Rajendra Prasad: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా గత నెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్రబృందం సక్సెస్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!
Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు వేదికపై వెళ్లి మాట్లాడుతూ సినిమాతో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను వేదికపైకి ఆహ్వానించారు. ఇకపోతే ఈయన వేదికపైకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ప్లే చేశారు.

Rajendra Prasad: మధ్యలో నీ గోలేంటమ్మా… అంటూ యాంకర్ మంజూష పై అసహనం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్..!

ఇక వేదిక పైకి వెళ్లిన రాజేంద్రప్రసాద్ మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని వెళ్లగా.. యాంకర్ మంజూష మొహానికి ఖర్చీఫ్ ఎందుకు తీసేయండని చెప్పబోయింది. దీంతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ఆగవమ్మ మధ్యలో నీ గోల ఏంటి… ముందు మమ్మల్ని మాట్లాడనీవ్వు.. ఇక్కడ మా గోలే సరిపోవడం లేదు అంటూ తన పై అసహనం వ్యక్తం చేశారు.

యాంకర్ పై రాజేంద్ర ప్రసాద్ అసహనం..

ఈ విధంగా రాజేంద్రప్రసాద్ మంజూష పై అసహనం వ్యక్తం చేయడంతో యాంకర్ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. ఇక పోతే తాను ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సినిమా హిట్ కాకపోతే నా మొహం మీకు చూపించనని చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికపైకి వెళ్లి ఆయన అందరికీ తన మొహాన్ని చూపించారు. ఇలా నేను నా మొహం మీకు చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఈ సినిమా హిట్ అయింది అంటూ వేదికపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.