Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమిని చవి చూసింది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఓటమిపై ఇంకా వైసీపీ అభిమానులు ఈ ఫలితాల నుంచి బయటపడలేకపోతున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని తెలిపారు. మనం చేసిన పాపాలు మనల్ని మింగుతాయని చెప్పటానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయనకు 151 సీట్లను ఇచ్చారని తెలిపారు.

జగన్ తప్పు చేశారు..
ఆయన తప్పులు చేయటంతోనే అదే ప్రజలు గద్దె దించారని తెలిపారు. ఇక ఈయన తన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదని తద్వారా వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లి నేడు ఎంపీలుగా మంత్రులుగా కూడా కొనసాగుతున్నారని తెలిపారు. జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు. ఫలితంగా రాష్ట్రం పైన ప్రభావం చూపిందని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించాననే విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు.