Sarath Babu: శరత్ బాబుకి అది దేవుడిచ్చిన వరం… ఎమోషనల్ అయిన పరుచూరి గోపాలకృష్ణ!

Sarath Babu: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శరత్ బాబు మే 22వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ద్వారా పలు విషయాలను తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ మరణిస్తూ ఉండడం తనని చాలా బాధకు గురి చేస్తుందని తెలిపారు. ఇక శరత్ బాబు గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయం మనకు తెలిసిందే. శరత్ బాబు గారి మరణ వార్త తనని ఎంతగానో కలిచి వేసిందని తెలిపారు.

శరత్ బాబు గారు ఎప్పుడు చాలా సరదాగా నవ్వుతూ కనిపించేవారు మా ఇంటి పక్కనే వారి ఇల్లు కూడా ఉండేదని నేను అలా వాకింగ్ వెళ్లిన సమయంలో ఆయన కనిపించే వారిని అయితే ఎప్పుడు చూసిన తను నవ్వుతూనే ఉండే వారని తెలిపారు. ఆయనకు నవ్వు దేవుడిచ్చిన వరం అంటూ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇక శరత్ బాబు గారి వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే.

Sarath Babu: మౌనంలోనే కన్నీళ్లు కార్చారు…


ఏ మనిషికైనా భరించలేని కష్టాలు వస్తే సన్యాసం తీసుకుంటారు కానీ శరత్ బాబు అలా చేయలేదు. ఆయన భరించలేని కష్టాలు వచ్చిన సమయంలో ఒంటరితనంలోకి వెళ్లిపోయారు. ఒంటరితనం మౌనం ఆయన జీవితంలో భాగమయ్యాయి.మౌనంగా ఆయన ఎన్ని కన్నీళ్లు కార్చారో తెలియదు కానీ కన్నీళ్లను మాత్రం బయటకు రానీయని మహానుభావుడు శరత్ బాబు అంటూ ఈ సందర్భంగా శరత్ బాబు గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.