Sarath Babu: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శరత్ బాబు మే 22వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ద్వారా పలు విషయాలను తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ మరణిస్తూ ఉండడం తనని చాలా బాధకు గురి చేస్తుందని తెలిపారు. ఇక శరత్ బాబు గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఒక గొప్ప నటుడు అనే విషయం మనకు తెలిసిందే. శరత్ బాబు గారి మరణ వార్త తనని ఎంతగానో కలిచి వేసిందని తెలిపారు.
శరత్ బాబు గారు ఎప్పుడు చాలా సరదాగా నవ్వుతూ కనిపించేవారు మా ఇంటి పక్కనే వారి ఇల్లు కూడా ఉండేదని నేను అలా వాకింగ్ వెళ్లిన సమయంలో ఆయన కనిపించే వారిని అయితే ఎప్పుడు చూసిన తను నవ్వుతూనే ఉండే వారని తెలిపారు. ఆయనకు నవ్వు దేవుడిచ్చిన వరం అంటూ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇక శరత్ బాబు గారి వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే.
ఏ మనిషికైనా భరించలేని కష్టాలు వస్తే సన్యాసం తీసుకుంటారు కానీ శరత్ బాబు అలా చేయలేదు. ఆయన భరించలేని కష్టాలు వచ్చిన సమయంలో ఒంటరితనంలోకి వెళ్లిపోయారు. ఒంటరితనం మౌనం ఆయన జీవితంలో భాగమయ్యాయి.మౌనంగా ఆయన ఎన్ని కన్నీళ్లు కార్చారో తెలియదు కానీ కన్నీళ్లను మాత్రం బయటకు రానీయని మహానుభావుడు శరత్ బాబు అంటూ ఈ సందర్భంగా శరత్ బాబు గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…