ఓ వైపు భర్తతో కాపురం చేసి.. మరో వైపు ప్రియుడితో రాసలీలు సాగించింది.. చివరకు ఏమైందంటే..?

ఇద్దరు పిల్లల తల్లి… 22 ఏళ్ల కాపురం.. అయినా సంతోషకరమైన జీవితాన్ని వదిలి తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందో మహిళ. ఆ మహిళ కోసం అటు భర్త, ఇటు ప్రియుడు నాకంటే నాకంటూ కొట్టుకుంటున్న ఘటన హైదరాబాద్, హన్మకొండ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ టీచర్స్ కాలనీలో ఉంటున్న లంకా శశికాంత్ (42), భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యవతి(35) భార్య భర్తలు. వీరిద్దరికి ఒక కుమారుడు(16), కుమార్తె (13) ఉన్నారు.

శశికాంత్ కు, దుర్గా సుశీలకు 1999లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పిన సుశీల ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె ఉడాయించింది.  భార్య కోసం చాలా చోట్ల వెతికినా ఆమె జాడ కనిపించలేదు. చివరకు ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యప్రసాద్ తో వెళ్లిపోయిందని తెలిసింది.

భార్య బంగారం, నగలుతో పారిపోయిందని స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో శశికాంత్ ఫిర్యాదు చేశారు. అయితే వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిచారు. కాగా తనకు పెళ్లి కాలేదని.. శశికాంత్ తన  భర్త కాదని, అక్క చనిపోతే చుట్టం చూపుగా వచ్చానని.. ఈ పిల్లలు నాకు పుట్టలేదని సమాధానం ఇచ్చింది సుశీల. అయితే పోలీసులు విచారణ జరపగా.. దుర్గా సుశీల, శశికాంత్ భార్యే అని తేలింది.

ఇదిలా ఉంటే ప్రియుడు సత్యప్రసాద్ తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్ లో కాపురం పెట్టి.. సహ జీవనం చేయసాగారు. కాగా ఈనెల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో సుశీలను, సత్య వరప్రసాద్ పెళ్లి చేసుకోవడం కొసమెరుపు. ఈ క్రమంలో మళ్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. తన పిల్లలకు తల్లి ప్రేమ కావాలని.. నా భార్యను నాకు అప్పగించండి అని వేడుకున్నాడు. కాగా ఇదిలా ఉంటే రెండో భర్త సత్య వర ప్రసాద్ తన భార్య సుశీల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని.. కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం వెతుకుతున్నారు.