YS Jagan: జగన్ కి 15 సీట్లే వస్తాయని ముందే తెలుసా… 6 నెలల ముందే ఇంటిలిజెన్స్ నివేదిక!

YS Jagan: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతో విజయం సాధించిన ఈ ప్రభుత్వం గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఇప్పటికీ ఈ విషయాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విధంగా వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు కానీ ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసంటూ ఇటీవల ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయి అంటూ ఇంటిలిజెన్స్ రిపోర్టర్లు నివేదికలను వెల్లడించినట్లు తెలియజేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలలో 15 సీట్లకు వస్తాయని ఎక్కడెక్కడ ఓట్లు ఎవరికి ఎన్ని వస్తాయో అనే విషయాన్ని కూడా ఓ అధికారి జగన్ మోహన్ రెడ్డికి తెలియచేయగా ఆయన మాత్రం ఆ అధికారి మాటలను పక్కనపెట్టి తనని బదిలీ చేశారు. అలాకాకుండా ఆ అధికారి చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయి అనే విషయం గురించి ఆరా తీస్తూ తప్పు సరిదిద్దుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

తప్పులు సరిదిద్దుకోలేదు..
పోలింగ్ పూర్తైన తర్వాత ఎక్కడెక్కడ వైసీపీ ఓడిపోతుందో ఎన్ని ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపొతుందో చెప్పారని జాఫర్ పేర్కొన్నారు. ఇలా అధికారి వైసిపి ప్రభుత్వానికి వచ్చే ఫలితాలు గురించి ముందుగానే చెప్పారని చెప్పిన ఈయన అధికారి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.