యాంకర్ శ్రీముఖిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. ఆ పని ఎందుకు చేశావంటూ..!

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. పటాస్ షోతో ఫుల్ పాపులర్ అయిన శ్రీముఖికి బుల్లితెర ‘రాములమ్మ’గా కూడా మంచి పేరుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది.

ఫోటో షూట్ లతో పాటుగా తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన తమ్ముడు సుష్రుత్‌ కి ఖరీదైన కారుని కొని గిఫ్ట్ గా ఇచ్చింది శ్రీముఖి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఫోర్డ్ కంపెనీ కారు ఎందుకు కొన్నావు అంటూ శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు. ఫోర్డ్‌ భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి కారు కొనడం కరెక్ట్ కాదంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

భారత్ ను విడిచి వెళ్లే కంపెనీ కారు కొనడంపై నెటిజన్లు కాస్త అసహనంతో ఉన్నారు. ఇకపోతే శ్రీముఖి 2019 మార్చిలో ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీముఖి యాంకర్ గానే కాకుండా గ్లామర్ నటిగాను వెండితెరపై సత్తా చూపిస్తోంది. ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో మెరిసిన శ్రీముఖి.. మరో రెండు మూడు ప్రాజెక్ట్స్‌ కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.