Sri Reddy: ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

Sri Reddy: సంచలన తార శ్రీరెడ్డి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు .అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఎవరిని టార్గెట్ చేసిన లేదా ఎలాంటి వీడియో చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా శ్రీరెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ అతనిని బండబూతులు తిడుతూ ఫైర్ అయ్యింది. ఇంతకీ శ్రీ రెడ్డి హైపర్ ఆది పై ఫైర్ అవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. అయితే హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ పరోక్షంగా ఇతరులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఎంతో కించపరుస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో వైసిపి పార్టీ పై కూడా తన పంచు డైలాగులు ఉపయోగిస్తూ ఉంటారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రోజా గారితో మంచి అనుబంధం ఉండడంతో రోజా పిలుపుమేరకు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు.ఈ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పటికీ హైపర్ ఆది మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు. దీంతో శ్రీ రెడ్డి హైపర్ ఆదిని టార్గెట్ చేశారు.

Sri Reddy: సిగ్గు లేని ఎదవ…


ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు హైపర్ ఆది తన కుక్క బుద్ధి చూపించుకున్నారు. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి అయినా తాను సిద్ధమేనని నిరూపించుకున్నాడు.. నీకు ఇష్టం లేకపోతే రాకుండా ఉండాలి అంటూ రెచ్చిపోయింది. డబ్బులు ఇస్తే ఇష్టం లేకపోయినా వస్తావా అని ప్రశ్నించారు. ఆదిగాడికి మన పార్టీ గాలి పడదు… వాడు ఆకులో ఈకగాడు.. ఇలాంటి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత..ఆది రాకపోతే జగనన్న బర్తడే ఆగిపోతుందా… సిగ్గులేని ఎదవ అంటూ బండు బూతులు తిట్టేశారు.ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.