Tag Archives: Almonds

ఈ పదార్థాలను నానబెట్టి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

మనుషులు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మంచి విటమిన్లు, ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదం : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదంను తీసుకోవడం వల్ల ఎసిడిటీ,అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బాదంలో ప్రోటీన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.

అవిసె గింజలు : నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

ఎండు ద్రాక్ష : ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎసిమియా,కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలు తగ్గుతాయి.వీటిని నానబెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పొటాషియం,కాల్షియం,మెగ్నీషియం, ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.

మెంతులు : వీటిని ఎక్కువగా వంటలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల, ఇందులో ఉండే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది షుగర్ పేషెంట్లకు కూడా మేలు చేస్తుంది.

మొక్క పెసలు : వీటిలో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. జీర్ణ సమస్యలను పోగొట్టడమే కాకుండా, గ్యాస్ కాన్స్టిట్యూషన్ వంటి వాటి నుండి బయట పడవచ్చు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఎంత లాభమో తెలుసా?

సాధారణంగా చాలామంది బాదం పప్పు కిస్మిస్ వంటి డ్రైవ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది వీటిని పచ్చివిగా తినడానికి ఇష్టపడుతుంటారు. మరి కొందరు వీటిని వివిధ రకాల వంటలలో వేసుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే బాదంపప్పును చాలామంది పచ్చిగా తింటూ ఉంటారు.అయితే బాదం పప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి ముందుగా తీసుకోవడం వల్ల మనం మెదడు ఎంతో చురుగ్గా పని చేస్తూ, జ్ఞాపకశక్తిని పెంపొందింప చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పు అన్ని వయసుల వారికి కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అదేవిధంగా నానబెట్టిన బాదం పప్పు మన శరీరంలో ఎంజైములను ఉత్పత్తి చేసి జీర్ణక్రియను పెంపొందింపజేస్తుంది.

నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మన శరీరానికి కావలసినంత ఫైబర్లు, ప్రొటీన్లు, విటమిన్లు మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. తద్వారా మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది.మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది.నానబెట్టిన బాదం పప్పును విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో దోహదపడుతుంది. అదేవిధంగా డయాబెటిస్ వంటి సమస్యతో బాధపడేవారికి బాదంపప్పు ఎంతో ప్రయోజనకరం.

చాలామంది నానబెట్టిన బాదం పప్పును పొట్టుతీసి తింటూ ఉంటారు. అయితే ఈ విధంగా పోట్టు తీయడం వల్ల ఎన్నో రకాల పోషక పదార్థాలను మనం వృధా చేసుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాదంపప్పు పొట్టులో కూడా అధిక మొత్తంలో ఫైబర్లు ఉంటాయి. కనుక పొట్టు తీయకుండా పొట్టుతో సహా తీసుకోవడం వల్లే మన శరీరానికి అదనంగా పోషకాలు అందుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..!!

సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు నిత్యం జబ్బుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలం, శీతాకాలంలో పిల్లలను జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు ప్రతిరోజూ ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే తక్కువగా రోగాల బారిన పడతారు. పిల్లలకు ప్రతిరోజూ క్యారెట్లను తినిపించాలి. క్యారెట్ల ద్వారా విటమిన్ ఎ, జింక్ సమృద్ధిగా లభిస్తాయి.

బాదం, పిస్తాపప్పు, జీడిపప్పు, నట్స్ ఇమ్యూనిటీని పెంచి పిల్లలు బలంగా తయారయ్యేలా చేస్తాయి. జీడిపప్పు, పిస్తాపప్పు రోజూ తినే పిల్లలకు సంపూర్ణ పోషణ లభించడంతో పాటు వాళ్లు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. నిమ్మ జాతికి చెందిన పండ్లు సైతం పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. చిన్నారులు వారంలో ఒకసారైనా నారింజ, బత్తాయి లాంటి పండ్లను తీసుకోవాలి.

ఈ పండ్ల ద్వారా పిల్లలకు వాళ్ల శరీరానికి అవసరమైన సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో వాళ్లు జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. పిల్లలకు ఖచ్చితంగా తినిపించాల్సిన ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో పెరుగు సహాయపడుతుంది.

పిల్లలకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కంగా ఉండే ఆహారాన్ని అందించాలి. ఇడ్లీ, రాగి జావ, బ్రెడ్ లను బ్రేక్ ఫాస్ట్ గా ఇవ్వడంతో పాటు లంచ్ లో చపాతీ లేదా అన్నం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలు, పల్లీలు, గుడ్లు, అరటిపండ్లు కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.