Tag Archives: anchor Rashmi

మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది.. పిల్లలకు నేర్పించే విలువలు ఇవేనా: రష్మీ

ప్రస్తుత కాలంలో పిల్లలు కేవలం చదువులో పోటీపడి ఒకరిని మించి ఒకరు చదువు కోసం తాపత్రయపడుతున్నారు. కానీ వారి జీవిత పాఠాలను నేర్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ఓ సందర్భంలో తెలియజేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా రష్మి ఈ విధంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో ని పిల్లలకు తమ జీవితంలో ఏర్పడే ప్రజా సమస్యలను ఎదుర్కొనే విధంగా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఏది మంచి? ఏది చెడు? అని చిన్నప్పటి నుంచి వారికి అలవాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసారు.

 

డిగ్రీలు సాధించి అందరి కంటే ముందు వరుసలో ఉండాలన్న తపనతో జీవిత పాఠాలను నేర్చుకోవడంలో విఫలమవుతున్నారని మన భవిష్యత్తు ఇలాగే ఉంటుందని… రష్మీ ట్వీట్ చేయడమే కాకుండా,మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రాంతానికి చెందిన సెంథిల్ కుమార్ అనే యానిమల్ లవర్ తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లాడు ఒక కుక్క పిల్లను నీటితొట్టె దగ్గరకు తీసుకువెళ్లి దానిని అందులో పడేసి, దాని చావుకు కారణమయ్యాడు. ఈ సంఘటనపై యాంకర్ రష్మి తీవ్రంగా స్పందించి, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.

రష్మీ చేసిన ట్వీట్ కు స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో పడి పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించడంలో పూర్తిగా విఫలమయ్యామని సదరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు మంచి, చెడు విషయాలను చిన్నతనంలోనే నేర్పించాలని కామెంట్లు చేస్తున్నారు. చిన్నతనం నుండి పిల్లలకు సేవ, మానవత్వం, జాలి వంటి విషయాలను గురించి నేర్పించాలని ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్క తల్లిదండ్రులను వేడుకున్నారు.

యాంకర్ రష్మీకి కరోనా పాజిటివ్… షూటింగులు రద్దు..?

బుల్లితెర జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కరోనా నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుధీర్ కు కరోనా నిర్ధారణ కాగా తాజాగా రష్మీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు రావడం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తలు రష్మీ అభిమానులతో పాటు ఆమెతో షోలలో, ఈవెంట్లలో పాల్గొన్న సెలబ్రిటీలను సైతం టెన్షన్ పెడుతున్నాయి. ప్రస్తుతం రష్మీ హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే రష్మీకి కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలపై ఆమె టీమ్ కానీ ఆమె కానీ స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం రష్మీ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారని..వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. మరోవైపు జబర్దస్త్ షో షూటింగులు క్యాన్సిల్ అయ్యాయని రేపు మరియు ఈ నెల 28వ తేదీన జబర్దస్త్ షో షూటింగులు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ షూటింగులను సైతం వాయిదా వేశారని సమాచారం.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించలేక పోవడం గమనార్హం. మరోవైపు రష్మీ ప్రధాన పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కరోనా సోకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కు సైతం రష్మీ దూరంగా ఉండదనుంది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోకుతున్న కరోనా మహమ్మారి సినిమా, టీవీ రంగాలను కుదిపేస్తోంది. ఒక్కరికి వైరస్ సోకినా అప్పటివరకు షూటింగ్ లో పాల్గొన్న వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.