Tag Archives: andha pradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ప్రస్తుతం రైల్వే జోన్ తీసుకురావాలనే ప్రతి పాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఈ జోనల్ తో ఆ కోరిక తీరనుంది. పూర్తి స్థాయిలో విశాఖ పట్నం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన అన్ని పనులను త్వరలో ప్రారంభం కానున్నానయని కూడా ప్రకటన చేశారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ జోన్ కు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైందని చెప్పినట్లు జి.వి.ఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక శుభవార్త అని తెలిపారు.

గడిచిన మూడు సంవత్సరాలను నుంచి..

ఈ విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణ కార్యాలయం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని.. పూర్తి స్థాయిలో రైల్వే జోన్ కార్యకలాపాలను అతి త్వరలోనే జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇక రైల్వే బోర్టు అనేది వాస్తవానికి జోన్లు తగ్గించాలనే ఆలోచనలో ఉందని.. విశాఖ రైల్వే జోన్ రైల్వే‌స్‌కు నష్టం కలిగించే ప్రతిపాదన అయినప్పటికీ.. మోదీకి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఈ మంచి నిర్ణయం తీసుకున్నారననారు. డీపీఆర్ త్వరలోనే ఆమోదింపబడి పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలను నుంచి పన్నులు రూపంలో ఏపీ నుంచి కలెక్ట్ చేసిన మొత్తం కంటే.. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలోని ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరు.. కారణమేమిటంటే..?

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలలో దీపవళి పండుగ వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి, పూజలు చేసి, బాణసంచా కాల్చి సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఏపీలోని ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం దీపావళి పండుగను జరుపుకోరు. ఆ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున దీపావళి పండుగను చేసుకున్నా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి మండలంలోని పున్నవపాలెం గ్రామంలో మాత్రం ఒక్క దీపం కూడా వెలగదు.

దీపావళి పండుగను జరుపుకోకూడదనే ఆచారం అనాదిగా ఆ గ్రామంలో కొనసాగుతోంది. దాదాపు 200 సంవత్సరాలుగా ఈ గ్రామంలోని ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీపావళి పండుగ రోజున ఆ గ్రామంలో దీపాలు వెలగకపోవడంతో పాటు బాణసంచా కూడా పేలదు. ఆ గ్రామ ప్రజలు దీపావళి పండుగను జరుపుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి. దీపావళి పండుగ రోజున ఆ గ్రామంలో ఒక పాప, రెండు ఎద్దులు 200 సంవత్సరాల క్రితం మరణించాయి.

దీపావళి పండుగ రోజున ఆ విధంగా జరగడంతో గ్రామస్థులు ఈ ఘటనను అపచారంగా భావించారు. అప్పటినుంచి ఆ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. నాగులచవితి పండుగ సమయంలో సైతం గ్రామంలో ఇదే విధంగా జరగడంతో గ్రామస్తులు ఆ పండుగను కూడా నిషేధించారు. అయితే గ్రామస్తులు మాత్రం పండుగ జరుపుకుంటే బాగుంటుందని దీపావళి గురించి అభిప్రాయపడుతున్నారు.

200 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఘటనల వల్ల పండగలను పూర్తిగా నిషేధించటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అయితే గ్రామ పెద్దలు మాత్రం కట్టుబాట్లు మార్చబోమని అలా మార్చితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.