Tag Archives: android mobile

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ల వల్ల వచ్చే సెక్యురిటీ త్రెట్స్ కూడా పెరిగాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా..మన సున్నిమైన సమాచారం దొంగల చేతికి వెళ్లిపోయే ఆస్కారం ఉంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ప్రస్తుతం తన వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ పాలసీ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతోంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ఆపిల్ తరహా సెక్యురిటీ ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందించనుంది. ఐఓఎస్ తరహా ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఐఫోన్లకు అందించే ఫీచర్లను ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2021లో ఎప్రిల్ లో ఐఫోన్ యూజర్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ ని ట్రాక్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్ ని ఆపిల్ అందిస్తోంది. 

రెండేళ్లలో కొత్త ప్రైవసీ పాలసీ..


అయితే ఇప్పుడు అదే తరహాలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురాబోతున్నట్లు తెలిసిొంది. ప్రైవసీ పాలసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మెనేజ్మెొంట్ ఉపాధ్యక్షుడు ఆంథోనీ చవెన్ ఓ బ్లాక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్ సోల్యూషన్లు, కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక థర్డ్ పార్టీలతో డాటా షేర్ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పలు అందుబాటులోకి తీసుకురావాటంలే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. థర్డ్ పార్టీ యూజర్లు షేర్ చేసే అంశంలో గూగుల్ కొత్త ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ను తీసుకురానుంది.

సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.. ధర ఎంతంటే!

ఇప్పటికే మార్కెట్లో సరి కొత్త సిరీస్ లతో వివిధ రకాల కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే టెక్నో స్పార్క్ 7 సిరీస్ ను ఇదివరకే లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే సిరీస్లో మరొక ఒక కొత్త ఫోన్ ను సదరు కంపెనీ లాంచ్ చేసింది.ఈ సిరీస్ లో వెనక వైపు మూడు కెమెరాలతో పాటు, 90 హెర్ట్జ్ డిస్ ప్లే ఉంది. అదేవిధంగా మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు.

తాజాగా లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 7 పీ స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి 64 జీబీ వేరియంట్ కాగా, మరొకటి 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఏం ధర ఎంత అనే విషయం మాత్రం సదరు కంపెనీ వెల్లడించలేదు. అదేవిధంగా ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎప్పుడు సేల్స్ కి వస్తాయో తెలియడం లేదు.

ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టెక్నో స్పార్క్ 7 మనదేశంలో రూ.7,499 ధరతో లాంచ్ అయింది. మరి టెక్నో స్పార్క్ 7 పీ ధర కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. సదరు కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 6.8 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే వెనుక వైపు మూడు కెమెరాలు కలిగి ఉన్నాయి. మొదటి కెమెరా 16 మెగాపిక్సల్ సామర్థ్యం ఉండగా, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సల్ సామర్థ్యం ఉంది.డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకవైపు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, మందం 0.91 సెంటీమీటర్లుగా ఉంది.