Tag Archives: april

Work From Home: ఇంటి దగ్గర పని చేసింది చాలు..! ఇక ఆఫీస్ లకు వచ్చేయండి..!

Work From Home: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో దాడులు చేస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి.  కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రెండేళ్ల నుంచి ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు.

కరోనా కారణంగా ఆఫీసులంతా మూతపడ్డాయి. వరసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లు ఇలా వస్తూనే ఉన్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు. ఇంటి నుంచే పనులు కొనసాగిస్తున్నారు. ఇటీవల డిసెంబర్, జనవరి నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ సమయంలో థర్డ్ వేవ్ రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా..


అయితే తాజాగా ఏప్రిల్ నుంచి మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇక తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు కూడా ఇక కరోనా ముగిసిందని, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకోకపోవడంతో.. ఆ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మళ్లీ ఐటీ కంపెనీలు తెరుచుకుంటే.. ఉపాధి లభిస్తుందనే ఆలోచనలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వీరందరిని మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా కంపెనీలు కబురు పెట్టాయి.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు భారీ షాక్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలలు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. గతంతో పోలిస్తే కేంద్రానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. . సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాలను అనుసరించి వేతనాలను చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం కీలక ప్రకటన చేసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కరోనా విజృంభణ వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీ.పీ.ఎస్.ఈ ఉద్యోగుల డీఏలకు, అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లకు ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ మార్గదర్శకాలు అమలవుతాయని అందువల్ల డీఏ అదనపు చెల్లింపులు ఉండవని తెలిపింది. 2021 జులై నుంచి కేంద్రం డీఏ చెల్లించనుండగా ఎంతమొత్తం చెల్లించనుందో తెలియాల్సి ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే డీఏ పెంపు ఉండదని కీలక ప్రకటన చేసింది. కేంద్రం డీఏ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లపై పడటం గమనార్హం.

విద్యార్థులకు అలర్ట్.. పది, ఇంటర్ పరీక్షల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పెద్దపెద్ద నగరాల నుంచి చిన్న పల్లెటూళ్ల వరకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలోని విద్యా సంస్థలు ఇప్పటికే తెరుచుకోగా తెలంగాణలో డిసెంబర్ నెల నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

2021 సంవత్సరంలో ఏప్రిల్ నెల చివరి వారం పదో తరగతి పరీక్షలు, మే నెల చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. గతంతో పోలిస్తే పనిదినాలు తగ్గినా ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. అయితే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రయోజనం చేకూర్చేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ప్రశ్నలు పెరగనున్నాయి.

అధికారులు ఇతర పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు డిసెంబర్ 1న మొదలు కానుండటంతో ఐదు నెలల విద్యా బోధన జరిగిన తరువాత పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.

విద్యాశాఖ తొలుత ఇంటర్ విద్యార్థులకు కూడా సడలింపులు ఇవ్వాలని భావించినా సడలింపులు ఇస్తే పోటీ పరీక్షల్లో విద్యార్థులు వెనుకబడే అవకాశం ఉందని విద్యాశాఖ ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.