కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పెద్దపెద్ద నగరాల నుంచి చిన్న పల్లెటూళ్ల వరకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలోని విద్యా సంస్థలు ఇప్పటికే తెరుచుకోగా తెలంగాణలో డిసెంబర్ నెల నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
2021 సంవత్సరంలో ఏప్రిల్ నెల చివరి వారం పదో తరగతి పరీక్షలు, మే నెల చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. గతంతో పోలిస్తే పనిదినాలు తగ్గినా ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. అయితే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రయోజనం చేకూర్చేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ప్రశ్నలు పెరగనున్నాయి.
అధికారులు ఇతర పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు డిసెంబర్ 1న మొదలు కానుండటంతో ఐదు నెలల విద్యా బోధన జరిగిన తరువాత పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.
విద్యాశాఖ తొలుత ఇంటర్ విద్యార్థులకు కూడా సడలింపులు ఇవ్వాలని భావించినా సడలింపులు ఇస్తే పోటీ పరీక్షల్లో విద్యార్థులు వెనుకబడే అవకాశం ఉందని విద్యాశాఖ ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…