Featured

ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ప్రమాదంలో 50 లక్షల ఉద్యోగాలు..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలామంది ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిపుణులు గతంతో పోలిస్తే ప్రయాణ డిమాండ్ 75 శాతం కుప్పకూలిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణికులు ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో ఏకంగా 50 లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గ్లోబల్ ఏవియేషన్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఈ విషయాలను వెల్లడించింది. కరోనా విజృంభణ వల్ల ఏర్పడిన పరిమితుల నేపథ్యంలో విమానాల తయారీ సామర్థ్య పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, గ్రౌండింగ్ విమానాల పరిశ్రమలలో ఉద్యోగులకు పని లేకుండా పోయింది.

ప్రపంచవ్యాప్తంగా గతంతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గడంతో లక్షల మంది ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ కాటన్ మాట్లాడుతూ కరోనా విజృంభణ వల్ల ఏవియేషన్ రంగం ఉపాధి విపత్తును ఎదుర్కొంటోందని.. విమానయాన పరిశ్రమ సంక్షోభ స్థితిలో ఉందని తెలిపారు. గతంలో విమానయాన శాఖ ఉద్యోగులకు అమలైన పథకాల్లో 80 శాతం పథకాలు నిలిచిపోయాయని ఆయన అన్నారు.

దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా విమాన రంగం ఉపాధి విపత్తును ఎదుర్కోనుందని.. ప్రభుత్వాల జోక్యం ఉంటే మాత్రమే ఈ స్థితి నుంచి బయటపడవచ్చని చెప్పారు. సంస్కరణలు, పునరుద్ధరణల ద్వారా మాత్రమే సంక్షోభాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 minute ago

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

భారత్‌లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…

6 minutes ago

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

20 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

21 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

21 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

22 hours ago