ఒకప్పుడు దొంగలు దొంగతనాలు చేయాలంటే ఇళ్లలోకి చొరబడి డబ్బును దొంగలించేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు మోసగాళ్లు ఆన్ లైన్ లోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్లను సైతం మోసగాళ్లు మోసం చేస్తున్నారు. చాలామంది ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నా మోసపోయామని ఇతరులకు చెప్పడానికి, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టెన్షన్ పడుతున్నారు.
తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లను టార్గెట్ చేసుకొని సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఉజ్వల గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అందిస్తున్నట్టు సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ న్యూస్ నిజమని నమ్మి తమకు తెలిసిన వాళ్లకు న్యూస్ ను పంపుతున్నారు.
మరి కొందరు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తపై ఆరా తీసి ఈ వార్తలో నిజానిజాలను వెల్లడించింది. పీఐబీ పరిశోధనలో ఈ వెబ్ సైట్ ఫేక్ అని తేలింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఆన్ లైన్ లో వచ్చే ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. దొంగ వెబ్ సైట్లను నమ్మి అస్సలు మోసపోవద్దని సూచిస్తోంది.
ఈ మధ్య్ కాలంలో మోసగాళ్లు ఏదో ఒకటి ఆశ చూపి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మోసాల గురించి పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మోసపోయి బాధపడక తప్పదు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…