Tag Archives: architecture

వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ లో సింక్ ఈ దిశలో అస్సలు ఉండకూడదు..!

మన భారతీయులు ఎన్నో ఆచార వ్యవహారాలను మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే మనం చేసే ప్రతి పనిని అదే విధంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టిన కూడా తప్పనిసరిగా వాస్తు చూసి వాస్తు ప్రకారమే నిర్మాణాన్ని చేపడతారు. ఈ క్రమంలోనే వాస్తు పరంగా ఇంటిని నిర్మించడమే కాకుండా ఇంటిలో అలంకరించుకుని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అలంకరించుకుంటారు.

ఈ విధంగా మన ఇంట్లో వాస్తును అనుసరించడం వల్ల ఇంట్లోకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా కుటుంబంలో ఎలాంటి కలహాలు గొడవలు లేకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఆనందంగా గడపవచ్చు.ఈ క్రమంలోనే మన ఇంట్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి కిచెన్ లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక ఇంటిలో వంట గది ఎంతో అవసరమైనది అని చెప్పవచ్చు. మరి వంటగదిని ఏ విధంగా నిర్మించాలి వంటగదిలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి అనే విషయానికి వస్తే వంటగదిలో ఎప్పుడూ కూడా మనం ఏర్పాటు చేసుకున్న సింక్ వంట గ్యాస్ పక్కన ఉండకూడదు. ఈ విధంగా ఉండటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. అదేవిధంగా వంటగదిలో ఎల్లప్పుడూ చీకటి ప్రదేశాలలో కూరగాయలను ఉంచకూడదు.అలాగే గది మూలాలలో కూడా కూరగాయలు నిల్వ చేసుకోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన ఇంటిలో ఉన్న వైబ్రేషన్స్ అన్ని వంటగదిలో ఎక్కువగాఉంటాయి కనుక వంటగదిలో గాలి, అగ్ని, వెలుతురు,నీరు సమానంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మన ఇంట్లో ఉన్న వాస్తు లోపాలను పటిక బెల్లం తో పరిహారం చేసుకోవచ్చు..!

మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో, వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. మనం ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టిన , లేదా మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువును పెట్టాలన్న, వాటిని వాస్తు శాస్త్ర ప్రకారం సరైన స్థలంలోనే ఉంచుతాము. అదేవిధంగా మనం ఇంటిని నిర్మించే సమయంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఏవిధంగా నిర్మించుకోవాలి అడిగి నిర్మించుకుంటాము. ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రం పై ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. పొరపాటున మన ఇంట్లో ఏవైనా వాస్తు లోపాలు ఉంటే ఇంట్లో కష్టాలు ఉంటాయని బావిస్తారు కాబట్టి వాస్తు లోపాలు లేకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయితే కొన్ని సార్లు మన ఇంట్లో ఏర్పడే వాస్తు లోపాలకు పటిక బెల్లం ద్వారా పరిష్కారం మార్గమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే పటిక బెల్లం ద్వారా ఏ విధంగా వాస్తు లోపాలను పరిష్కరించుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం..

పటిక బెల్లం మనకు మార్కెట్లో విరివిగా లభిస్తుంది.ఈ పటిక బెల్లం సరైన క్రమంలో మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి వాస్తు లోపాలు ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పటిక బెల్లం తీసుకొని మన ఇంటిలో ఉన్న కిటికీలు, తలుపుల దగ్గర పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల ఏవైనా శిథిలావస్థలో చేరుకున్న ఇల్లు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పటిక బెల్లం పెట్టడం ద్వారా ఆ శిథిలమైన ఇంటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులు మన ఇంటి లోనికి ప్రవేశించవు.

పటిక బెల్లంను ఒక నల్లటి వస్త్రంలో కత్తి మన ఇంటికి నాలుగువైపులా ఎవరికీ కనిపించని విధంగా కట్టడంవల్ల మనం ప్రారంభించే ఎటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అదే విధంగా 5 పటిక బెల్లం ముక్కలను తీసుకుని నీలి రంగు పువ్వులతో పూజ చేసి నలుపురంగు వస్త్రంలో కట్టి మన జోబులో పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ విధంగా పటిక బెల్లం వాస్తు దోషాలను తొలగించి ధనప్రాప్తి కలగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

ఆ దేవాలయాలు ఎంతో అద్భుతం.. ఎందుకంటే?

మన భారతదేశం ఆధ్యాత్మిక మందిరాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయాలలో వెలిసిన దేవ దేవతల విశిష్టతలు తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి. అయితే ఆ రహస్యాల వెనుక గల కారణం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే కొన్ని దేవాలయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

* స్వామి వారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా కేరళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.

* 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కొని దేవాలయం బిజిలీ మహదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది.

* సంవత్సరానికి ఒక్కసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు
1నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.

* నిరంతరం కోనేటిలో నీరు ప్రవహించే దేవాలయాలు
1.మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్,
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి

*నిరంతరం జ్వాలా రూపంగా వెలిగే దేవాలయాలు
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.

ఈ దేవాలయాలలో జరుగుతున్న ఈ వింత రహస్యాలను గురించి ఇప్పటి వరకు ఎంతోమంది అన్వేషించి నప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కకుండా ఉండడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.