Tag Archives: bank news

మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అలా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవారు కేంద్రం నుంచి 10,000 రూపాయల రుణం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే కేంద్రం ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ కోసం అర్హత పొందాలంటే ఇంటి నుంచే సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్ సైట్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా లోన్ ను చెల్లించడంతో పాటు ఈ.ఎం.ఐ కట్టడం ద్వారా వడ్డీరేటులో సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థలు ఇచ్చే ఐడెంటిటీ కార్డ్ ఉన్నవాళ్లే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 12 ఈఎంఐల రూపంలో 9 శాతం వడ్డీతో ఈ రుణాలను తిరిగి చెల్లించాలి.

పీఎం స్వనిధి వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. లోన్ సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులు 1200 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. సక్రమంగా చెల్లించిన వారు మళ్లీ ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకునే అర్హత పొందుతారు.

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. బ్యాంకుల బంద్ ఎప్పుడంటే..?

మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ల సహాయంతో తరచూ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాం. అయితే బ్యాంక్ కస్టమర్లు బ్యాంకుల బంద్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ లావాదేవీలను నిర్వహించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు బ్యాంకుల బంద్ కోసం పిలుపునిచ్చాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మద్దతు ఇవ్వడంతో రేపు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక పాలసీలను అమలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధమైంది. గతంలో ఉన్న పాత చట్టాలలో మార్పులు చేసి కేంద్రం మూడు కొత్త కార్మిక చట్టాలకు ఆమోదం తెలపడంతో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం.

10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఈ సమ్మెలో పాల్గొననున్నాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్రం అమలులోకి తెస్తున్న కొత్త నిబంధనలు కార్మికులకు నష్టం కలిగించే విధంగా కార్పొరేట్లకు మేలు చేకూరే విధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాయి. దాదాపు 75 శాతం మంది కస్టమర్లకు కొత్త చట్టాలు వర్తించవని వెల్లడించాయి. భారతీయ మజ్దూర్ సంఘం తప్ప మిగిలిన అన్ని ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొంటూ ఉండటం గమనార్హం.

ఆల్‌ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తప్ప మిగిలిన ఇతర బ్యాంకుల ఉద్యోగులు అంతా ఉన్నారు. దేశంలోని మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది బ్యాం క్ ఉద్యోగులు రేపు సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని కూడా వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు.