Tag Archives: Bharat Biotech

Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకాకు డీసీజీఐ ఆమోదం..!

Covid Vaccine:దాదాపుగా గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలు అన్నింటినీ ఇబ్బంది పెడుతున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గుతుందనే లోపు ఏవో ఒక వేరియంట్లో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు మూడవ వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. అయితే రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ చేసిన నష్టాన్ని ఇప్పుడైతే ఇది చేయట్లేదు. మరణాల రేటు చాలా తక్కువగా నమోదు అవుతుంది.

ఇది ఒక రకంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ల సంఖ్య 150 కోట్లు దాటింది. అయితే ఇప్పుడు హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు, ఇంకా దరఖాస్తు చేసుకున్న వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. దీనిని కరోనా ప్రికాషనరి డోస్ అని కూడా అంటారు.

ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల భారత్ బయోటెక్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ 3 వారాల క్రితం బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడే చుక్కల మందును అప్రూవల్ కోసం అప్లై చేయడం జరిగింది. భారత్ బయోటెక్ కనిపెట్టిన చుక్కల ముందుకు క్లినికల్ ట్రయల్స్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు.

బూస్టర్ డోస్ లో భాగంగా చుక్కల మందు..

ఈ ట్రయల్స్ ను దాదాపుగా 900 మంది మీద ప్రయోగించనున్నారు. ఫేస్ 3 బూస్టర్ డోస్ లో భాగంగా DCGI నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన రెండవ కంపెనీ ఇదే కావడం విశేషం. ఇదివరకే రెండు డోసుల కోవాక్సిన్ లేదా కోవిషిల్డ్ తీసుకున్న వారికి ఈ చుక్కల మందు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ వివరించింది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా త్వరగా ట్రయల్స్ జరిపి ఈ చుక్కల మందులను త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ సంస్థ ఆలోచన.

Covaxin : కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారు ఈ మందులు వాడనవసరం లేదు..!

Covaxin: ప్రపంచమంతట కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలన్నింటికీ ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది . దీనిని అరికట్టటానికి 15-18 సంవత్సరాల పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు. కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న తరువాత ఇటువంటి మందులు వాడటం అవసరం లేదు అని భారత్ బయోటెక్ కంపెనీ స్పష్టం చేసింది . ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అందరికీ పారాసెట్మాల్ టాబ్లెట్ ఇస్తూ వాటిని మూడు రోజులు వాడమని చెప్పేవారు . టీకా వేయించుకున్న తర్వాత కొందరిలో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి , జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి . అందువల్ల టీకా వేయించుకున్న వారందరికీ మొదటిలో పారాసెట్మాల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు . అయితే కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారికి పారాసెట్మాల్ టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదని భారత్ బయోటెక్ కంపెనీ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది .

కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది . భారత్ బయోటెక్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం ” కోవాక్సిన్ తీసుకున్నవారికి టీకా తీసుకున్న తరువాత పేరాసెట్మాల్ ట్యాబ్లేట్ వేసుకోమని సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే, కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి ఆ మాత్రల అవసరం ఉండదు. మేము జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయంలో ఒక నిర్ధారణ వచ్చింది.


ఎలాంటి మందులతో అవసరం ఉండదు..

ఈ క్లినికల్ ట్రయల్స్ 30 వేల మందిపైజరిపాము. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అవికూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకటి రెండురోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి. దానికి ఏ విధమైన మందులతోనూ పనిలేదు.”ఒకవేళ ఏదైనా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటే.. వైద్యుడిని సంప్రదించాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.