Covaxin: ప్రపంచమంతట కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలన్నింటికీ ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది . దీనిని అరికట్టటానికి 15-18 సంవత్సరాల పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు. కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న తరువాత ఇటువంటి మందులు వాడటం అవసరం లేదు అని భారత్ బయోటెక్ కంపెనీ స్పష్టం చేసింది . ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అందరికీ పారాసెట్మాల్ టాబ్లెట్ ఇస్తూ వాటిని మూడు రోజులు వాడమని చెప్పేవారు . టీకా వేయించుకున్న తర్వాత కొందరిలో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి , జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి . అందువల్ల టీకా వేయించుకున్న వారందరికీ మొదటిలో పారాసెట్మాల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు . అయితే కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారికి పారాసెట్మాల్ టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదని భారత్ బయోటెక్ కంపెనీ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది .
కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది . భారత్ బయోటెక్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం ” కోవాక్సిన్ తీసుకున్నవారికి టీకా తీసుకున్న తరువాత పేరాసెట్మాల్ ట్యాబ్లేట్ వేసుకోమని సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే, కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి ఆ మాత్రల అవసరం ఉండదు. మేము జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయంలో ఒక నిర్ధారణ వచ్చింది.
ఈ క్లినికల్ ట్రయల్స్ 30 వేల మందిపైజరిపాము. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అవికూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకటి రెండురోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి. దానికి ఏ విధమైన మందులతోనూ పనిలేదు.”ఒకవేళ ఏదైనా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటే.. వైద్యుడిని సంప్రదించాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…