Covaxin: ప్రపంచమంతట కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలన్నింటికీ ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది . దీనిని అరికట్టటానికి 15-18 సంవత్సరాల పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు. కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న తరువాత ఇటువంటి మందులు వాడటం అవసరం లేదు అని భారత్ బయోటెక్ కంపెనీ స్పష్టం చేసింది . ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అందరికీ పారాసెట్మాల్ టాబ్లెట్ ఇస్తూ వాటిని మూడు రోజులు వాడమని చెప్పేవారు . టీకా వేయించుకున్న తర్వాత కొందరిలో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి , జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి . అందువల్ల టీకా వేయించుకున్న వారందరికీ మొదటిలో పారాసెట్మాల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు . అయితే కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారికి పారాసెట్మాల్ టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదని భారత్ బయోటెక్ కంపెనీ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది .
కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది . భారత్ బయోటెక్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం ” కోవాక్సిన్ తీసుకున్నవారికి టీకా తీసుకున్న తరువాత పేరాసెట్మాల్ ట్యాబ్లేట్ వేసుకోమని సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే, కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి ఆ మాత్రల అవసరం ఉండదు. మేము జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయంలో ఒక నిర్ధారణ వచ్చింది.
ఈ క్లినికల్ ట్రయల్స్ 30 వేల మందిపైజరిపాము. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అవికూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకటి రెండురోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి. దానికి ఏ విధమైన మందులతోనూ పనిలేదు.”ఒకవేళ ఏదైనా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటే.. వైద్యుడిని సంప్రదించాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…