Covid Vaccine:దాదాపుగా గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలు అన్నింటినీ ఇబ్బంది పెడుతున్న సమస్య కరోనా వైరస్. దీని ప్రభావం తగ్గుతుందనే లోపు ఏవో ఒక వేరియంట్లో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు మూడవ వేవ్ లో ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతోంది. అయితే రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ చేసిన నష్టాన్ని ఇప్పుడైతే ఇది చేయట్లేదు. మరణాల రేటు చాలా తక్కువగా నమోదు అవుతుంది.
ఇది ఒక రకంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ల సంఖ్య 150 కోట్లు దాటింది. అయితే ఇప్పుడు హెల్త్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు, ఇంకా దరఖాస్తు చేసుకున్న వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. దీనిని కరోనా ప్రికాషనరి డోస్ అని కూడా అంటారు.
ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేల భారత్ బయోటెక్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ 3 వారాల క్రితం బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడే చుక్కల మందును అప్రూవల్ కోసం అప్లై చేయడం జరిగింది. భారత్ బయోటెక్ కనిపెట్టిన చుక్కల ముందుకు క్లినికల్ ట్రయల్స్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు.
ఈ ట్రయల్స్ ను దాదాపుగా 900 మంది మీద ప్రయోగించనున్నారు. ఫేస్ 3 బూస్టర్ డోస్ లో భాగంగా DCGI నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ అనుమతులు పొందిన రెండవ కంపెనీ ఇదే కావడం విశేషం. ఇదివరకే రెండు డోసుల కోవాక్సిన్ లేదా కోవిషిల్డ్ తీసుకున్న వారికి ఈ చుక్కల మందు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత్ బయోటెక్ వివరించింది. ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా త్వరగా ట్రయల్స్ జరిపి ఈ చుక్కల మందులను త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ సంస్థ ఆలోచన.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…