తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చాలామంది అనుకుంటారు. అలాంటి బిజినెస్ కోసం వెతుకుతూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ ఓ అద్బుతమైన బిజినెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.కోటి వరకు సంపాదించొచ్చు. ఆ బిజినెస్ ఏంటంటే.. ఆన్లైన్ హోర్డింగ్ బిజినెస్. బిజినెస్ చేసే వాళ్లు ఎవరైనా తన కంపెనీ గురించి అందరికీ తెలియాలని.. మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు.
అలాంటి వారికి హోర్డింగ్ ల ద్వారా కూడా మార్కెటింగ్ చేయాలని అనుకుంటారు. వారి కోసమే ఈ ఐడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేసుకొని అందులో సిటీలోని ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు పెట్టడానికి పక్కా స్థలాన్ని గుర్తించాలి. కస్టమర్ మీ వెబ్సైట్లో లాగిన్ అయినపుడు ఆ స్థలాన్ని బుక్ చేసుకుంటారు.
అపుడు ఆ స్థలం వారికి మీరు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. వారు ఓకె అన్న తర్వాత కస్టమర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయొచ్చు. ఇలా రెండు వైపుల కమీషన్ తో సంపాదించొచ్చు. ఇలాగే గోహోర్డింగ్స్.కామ్ వ్యవస్థాపకురాలు దీప్తి అవస్థీ శర్మ 2016లో రూ.50 వేలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రూ. కోట్లల్లో సంపాదిస్తున్నారు.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. 2016 లో డిజిటల్ హోర్డింగ్ల వ్యాపారాన్ని చాలా తక్కువ మొత్తంలోరూ. 50 వేలతో ప్రారంభించానని.. ఈ ఆలోచన విజయవంతమైందని అన్నారు. వారికి స్థలాన్ని చూపించినందుకు కొంత కమీషన్.. స్థలం ఉందని వాళ్లకు తెలియజేసినందుకు మరో కమీషన్ ఇలా రెండు వైపులా కమీషన్ రావడంతో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు.