తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చాలామంది అనుకుంటారు. అలాంటి బిజినెస్ కోసం వెతుకుతూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ ఓ అద్బుతమైన బిజినెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.కోటి వరకు సంపాదించొచ్చు. ఆ బిజినెస్ ఏంటంటే.. ఆన్లైన్ హోర్డింగ్ బిజినెస్. బిజినెస్ చేసే వాళ్లు ఎవరైనా తన కంపెనీ గురించి అందరికీ తెలియాలని.. మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు.
అలాంటి వారికి హోర్డింగ్ ల ద్వారా కూడా మార్కెటింగ్ చేయాలని అనుకుంటారు. వారి కోసమే ఈ ఐడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేసుకొని అందులో సిటీలోని ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు పెట్టడానికి పక్కా స్థలాన్ని గుర్తించాలి. కస్టమర్ మీ వెబ్సైట్లో లాగిన్ అయినపుడు ఆ స్థలాన్ని బుక్ చేసుకుంటారు.
అపుడు ఆ స్థలం వారికి మీరు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. వారు ఓకె అన్న తర్వాత కస్టమర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయొచ్చు. ఇలా రెండు వైపుల కమీషన్ తో సంపాదించొచ్చు. ఇలాగే గోహోర్డింగ్స్.కామ్ వ్యవస్థాపకురాలు దీప్తి అవస్థీ శర్మ 2016లో రూ.50 వేలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రూ. కోట్లల్లో సంపాదిస్తున్నారు.
దీనిపై ఆమె మాట్లాడుతూ.. 2016 లో డిజిటల్ హోర్డింగ్ల వ్యాపారాన్ని చాలా తక్కువ మొత్తంలోరూ. 50 వేలతో ప్రారంభించానని.. ఈ ఆలోచన విజయవంతమైందని అన్నారు. వారికి స్థలాన్ని చూపించినందుకు కొంత కమీషన్.. స్థలం ఉందని వాళ్లకు తెలియజేసినందుకు మరో కమీషన్ ఇలా రెండు వైపులా కమీషన్ రావడంతో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…