Tag Archives: Cereals

రోగనిరోధక శక్తి పెంచుకోవాలా.. అయితే వీటిని తీసుకోండి..!

మన పూర్వికులు తినే ఆహారంలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉండే విధంగా ఆహార పదర్థాలు తినేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉరుకుల ప్రపంచంలో కనీసం ఆరోగ్యంపై శ్రద్ధ వహించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయంలో కూడా పండించే పంట కూడా మొత్తం ఎరువులమయం అయిపోయింది. తింటే రోగం.. తినకపోతే నీరసం.

ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మన తాతలు, బామ్మలు, అమమ్మలు తిన్న తిండేనే ఇప్పుడు మనమూ ఇష్టపడుతున్నాం. సామలు, అరికెలు కొర్రలు, అండు కొర్రలు, ఊడలు అంటూ వీటి వెంట పడుతున్నాం. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు చిరుధాన్యాలు తినేందుకు కూడా ఎక్కువగా మొగ్గు చూపతున్నారు.

దీనికి గల కారణం ఏంటంటే.. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా మారింది. బరువు తగ్గేవారు రాగుల్లో ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది. అందువల్ల రాగులు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కడుపులో అల్సర్ వంటివి తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మలబద్దకం ఉన్న వారికి చిరుధాన్యాలు ఒక ఔషదంగా పనిచేస్తుంది. వీటిని రోజూ వారి ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. త్వరగా ముసలితనం రాకుండా కూడా సహకరిస్తాయి.

కరోనా సోకకుండా డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సోకుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కరోనా సోకితే వైరస్ నుంచి కోలుకున్నా భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడే వాళ్లకు కరోనా సోకితే మరింత ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా సోకకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు.

కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది డయాబెటిస్ రోగులే కావడం గమనార్హం.డయాబెటిస్ రోగులకు కరోనా సోకితే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ తో బాధ పడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించడంలో వైద్యులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊబకాయం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు కరోనా వల్ల డయాబెటిస్ రోగులుగా మారుతున్నారు.

అయితే వైరస్ సోకాకుండా కరోనా రోగులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరైన ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. డయాబెటిస్ రోగులు ఉదయం లేచిన గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. రాత్రి 9 తరువాత ఆహారం తీసుకోకూడదు. రెండు పూటలా భోజనం, రెండు సార్లు స్నాక్స్ సరైన సమయాల్లో తీసుకోవాలి. ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డయాబెటిస్ తో బాధ పడేవారు అధిక ప్రోటీన్ తో కూడిన ఆహారం షుగర్ రోగులకు మంచిదని సూచిస్తోంది. చికెన్ బ్రెస్ట్, గుడ్లు, చేపలు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయి. వేరుశెనగ నూనె, ఆవాలు, నువ్వులు కలిపిన నూనె డయాబెటిస్ రోగులు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటితో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చు.