మన పూర్వికులు తినే ఆహారంలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉండే విధంగా ఆహార పదర్థాలు తినేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉరుకుల ప్రపంచంలో కనీసం ఆరోగ్యంపై శ్రద్ధ వహించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయంలో కూడా పండించే పంట కూడా మొత్తం ఎరువులమయం అయిపోయింది. తింటే రోగం.. తినకపోతే నీరసం.
ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మన తాతలు, బామ్మలు, అమమ్మలు తిన్న తిండేనే ఇప్పుడు మనమూ ఇష్టపడుతున్నాం. సామలు, అరికెలు కొర్రలు, అండు కొర్రలు, ఊడలు అంటూ వీటి వెంట పడుతున్నాం. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు చిరుధాన్యాలు తినేందుకు కూడా ఎక్కువగా మొగ్గు చూపతున్నారు.
దీనికి గల కారణం ఏంటంటే.. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా మారింది. బరువు తగ్గేవారు రాగుల్లో ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది. అందువల్ల రాగులు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కడుపులో అల్సర్ వంటివి తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మలబద్దకం ఉన్న వారికి చిరుధాన్యాలు ఒక ఔషదంగా పనిచేస్తుంది. వీటిని రోజూ వారి ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. త్వరగా ముసలితనం రాకుండా కూడా సహకరిస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…