Tag Archives: changes

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

Google: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది. ఒక్క మొబైల్ చాలు అంతా మన చేతిలోకి వస్తోంది. ఇంతా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. ఇదిలా ఉంటే సెల్ ఫోన్ల వల్ల వచ్చే సెక్యురిటీ త్రెట్స్ కూడా పెరిగాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినా..మన సున్నిమైన సమాచారం దొంగల చేతికి వెళ్లిపోయే ఆస్కారం ఉంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ప్రస్తుతం తన వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. యూజర్ల ప్రైవసీ పాలసీ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతోంది. 

Google: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్… ప్రైవసీ పాలసీ విషయాల్లో భారీ మార్పులు..

ఆపిల్ తరహా సెక్యురిటీ ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందించనుంది. ఐఓఎస్ తరహా ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఐఫోన్లకు అందించే ఫీచర్లను ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్లకు తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2021లో ఎప్రిల్ లో ఐఫోన్ యూజర్ల కోసం కొత్త యూజర్ ప్రైవసీ పాలసీని ఆపిల్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ సదరు యూజర్ ని ట్రాక్ చేయకుండా ఉండేలా కొత్త ఫీచర్ ని ఆపిల్ అందిస్తోంది. 

రెండేళ్లలో కొత్త ప్రైవసీ పాలసీ..


అయితే ఇప్పుడు అదే తరహాలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఇలాంటి ఫీచర్ ను గూగుల్ తీసుకురాబోతున్నట్లు తెలిసిొంది. ప్రైవసీ పాలసీ మార్పుల గురించి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మెనేజ్మెొంట్ ఉపాధ్యక్షుడు ఆంథోనీ చవెన్ ఓ బ్లాక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేటు అడ్వర్టయిజింగ్ సోల్యూషన్లు, కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చేందుకు కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక థర్డ్ పార్టీలతో డాటా షేర్ చేయడాన్ని తగ్గిస్తామని వెల్లడించారు. అయితే ఈ మార్పలు అందుబాటులోకి తీసుకురావాటంలే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని ఆయన అన్నారు. థర్డ్ పార్టీ యూజర్లు షేర్ చేసే అంశంలో గూగుల్ కొత్త ప్రైవసీ సాండ్ బాక్స్ ఫీచర్ను తీసుకురానుంది.

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

Youtube: యూట్యూబ్ ప్రత్యేకం పరిచయం అక్కర లేని పేరు. కంప్యూటర్లు, మొబైళ్లు వాడకం పెరగడంతో ఇది కూడా మన జీవితంలో భాగంగా మారింది. మనకు నచ్చిన వీడియోలను కళ్ల ముందు ఉంచుతోంది. ఇంటర్నెట్ యూజర్లలో ఎక్కువ శాతం యూట్యూబ్ ను కూడా వాడుతున్నారు. 

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

అయితే యూట్యూబ్ ను యూజర్లకు మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు కొత్తగా అప్ డేట్ అవుతోంది. యూట్యూబ్ సరికొత్త మార్పులతో రాబోతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ ఇంటర్పేస్( యూఐ) లో  మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా తీసుకురానున్న ఫీచర్లు అందరికీ ఉపయోగపడేలా ఉండనున్నాయి. 

Youtube: యూట్యూబ్ వాడుతున్నారా..? ఇటీవల దీనిలో కీలక మార్పులు చేశారు తెలుసా..?

ఇకపై వీడియోను మినిమైస్ చేయకుండా మనం నేరుగా వీడియోను లైక్ చేసే సదుపాయాన్ని తీసుకువచ్చారు. అలాగే డిస్ లైక్ కూడా చేయ్యెచ్చు. అలాగే వీడియో ప్లేయర్ యూఐ లోనే సేవ్ టూ ప్లే లిస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. షేర్ ఆప్షన్ కూడా తీసుకురానున్నారు. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ లో ఉండనున్నాయి.

యూట్యూబ్ యాప్ కు యాడ్..

గతంలో ఇవన్నీ చేయాలనంటే.. ఫుల్ స్క్రీన్ నుంచి మినిమైజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆ అవసరం ఉండదు. కొత్త యూఐ రావడంతో ఫుల్ స్క్రీన్ ఉండగానే.. వీడియోలకు కామెంట్లు చేయవచ్చు. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూట్యూబ్ యాప్ కు యాడ్ అయ్యాయి. ఒక వేళ కాకపోతే యాప్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిలా ఉండగా… యూట్యూబ్ ప్రీమియం, మ్యూజిక్ కోసం వార్షిక ప్లాన్లను తీసుకువచ్చారు. బెస్ట్ వ్యాల్యూ ఆఫర్్ గా ఏడాదికి రూ. 1290కు అందుబాటులోకి తెచ్చింది. నెల వారీ ప్లాన్ రూ. 139 గా, మూడు నెలల ప్లాన్  రూ. 399గా ఉంది.

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

Hyderabad Traffic: హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచస్థాయి మహా నగరంగా భాగ్యనగరం రూపుదిద్దుకుంటున్న సమయంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా తీరేలా మార్పలు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

ఇటీవల కాలంలో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి తగ్గట్లుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు తీరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీగా మార్పులు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.


ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే ..

ఈ క్రమంలోనే రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నగరంలో రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, లంగర్ హౌజ్, నానాల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్ రూపం పాటు పలు జంక్షన్లలో మార్పలు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు వాహనాల్నింటిని నేరుగా పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిలిం నగర్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫ్రీ లెఫ్ట్ ఇచ్చి మళ్లించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ విధానం సక్సెస్ అయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే అన్నింటిని తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ తెలిపారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ తో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని ఆయన అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్ లోని రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహించబోతున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

బాల కార్మిక చట్టంలో మార్పులు.. 14 ఏళ్ల లోపు పిల్లలను పనులకు తీసుకుంటే.. ఆ తర్వాత చుక్కలే..!

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా కొన్ని ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా.. బాలబాలికలను పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో వారి అమూల్యమైన బాల్యం మొదట్లోనే మోడు బారిపోతోంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదానికి తూట్లు పొడిచే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు.

దీనిపై కఠిన చట్టాలు ఉన్నా.. దీనిని ఎవరూ ఖాతరు చేయడం లేదు. తమ కుటుంబ పోషణ భారం అవుతుందని తమ పిల్లలను పనికి పంపిస్తున్నామని.. బడికి పంపించే స్థోమత లేకనే ఇలా చేస్తున్నామని ఆ బాలబాలికల తల్లిదండ్రలు చెబుతుండటం కొసమెరుపు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి ఉండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలని నిపుణులు అంటున్నారు.

రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలను కర్మాగారాలలో, గనులలో, ఇంక ఏ ఇతర ప్రమాదకర పనులలో కూడా ఎవరూ ఉంచకూడదు. దీనిలో భాగంగానే 1986లో బాల కార్మిక నిషేద చట్టం వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకొచ్చింది.

14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ పనులు చేయడానికి వీళ్లేదని.. ఒక వేళ ఎవరైనా పనిలో పెట్టుకుంటే.. పెట్టుకున్న యజమానితో పాటు.. తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతే కాకుండా.. యజమానికి రూ.25వేల నుంచి రూ. 50 వేల జరిమానాతో పాటు 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని.. యాథావిధిగా ఈ నిబంధనలను అమలు చేస్తామని కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.