Tag Archives: covid-19 positive

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందా.. అయితే ఏం చేయాలంటే..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సోకుతుందో తెలియని కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వైరస్ సోకిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా వైరస్ నుంచి కోలుకోవచ్చు.

చాలామంది కరోనా సోకిందని తెలిసిన వెంటనే కంగారు పడుతూ ఉంటారు. అయితే మందులు వాడుతూ సరైన ఆహారం తీసుకుంటే తక్కువ సమయంలోనే వైరస్ నుంచి కోలుకోవచ్చు. కరోనా నిర్ధారణ అయితే ఆస్పత్రికి వెళ్లకుండా హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేయించుకుని కూడా కోలుకోవచ్చు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వాడాల్సిన మందుల గురించి తెలుసుకుని సలహాలు, సూచనలు తీసుకోవాలి.

కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యునికి ముందుగానే తెలియజేయాలి. అలా చేయడం వల్ల వైద్యులు మందులు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. హోం ఐసోలేషన్ లో ఉంటే మిగతా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. వారికి మీ నుంచి వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక బాత్ రూమ్ ఉండటంతో పాటు వెంటిలేషన్ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

వైరస్ లక్షణాలు, తీవ్రతను బట్టి చికిత్సలో మార్పులు ఉంటాయి. తరచూ ఆక్సిజన్ లెవెల్స్ ను తప్పనిసరిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే ఇతర కరోనా పరీక్షలను చేయించుకోవాలి. పూర్తిగా కోలుకుని నెగిటివ్ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకిందా..?

ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కరోనా వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి తేజ్ పై ఇలాంటి వార్తలు రావడానికి ఒక ముఖ్యమైన కారణమే ఉంది. సాయి తేజ్ ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాను ఓటీటీ జీ 5కు విక్రయించారు. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీలో సోలే బతుకే సో బెటర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా సాయి తేజ్ కు కరోనా సోకడంతో డబ్బింగ్ పనులు ఆగిపోయాయని.. ఈ మేరకు సినిమా నిర్వాహకులు జీ ఛానల్ వాళ్లకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అయితే సాయి తేజ్ కు కరోనా సోకిందో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.

సాయి తేజ్ కు కరోనా నిర్ధారణ అయితే మాత్రం సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ మొత్తం చెల్లించి జీ నిర్వాహకులు ఈ సినిమాను కొనుగోలు చేసిన నేపథ్యంలో జీ తెలుగు సినిమా రిలీజ్ ఆలస్యమైతే ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా నిర్ధారణ కాగా ఆయన వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. రెండు రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా సైతం కరోనా బారిన పడి వేగంగా కోలుకున్న విషయం విదితమే. అయితే సినీ ప్రముఖులకు కరోనా నిర్ధారణ అవుతూ ఉండటంతో ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.