Tag Archives: Current Shock

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

Crime: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీల కోసం ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫీ లకు ఫోజులు ఇవ్వడం కోసం ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకొని ప్రాణాలతో చెలగాటం ఆడటం వల్ల ఎన్నో ప్రమాదా సంఘటనలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల బారిన పడి కొంత మంది ప్రాణాలతో బయట పడగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

ఇప్పటికే ఎంతోమంది కొండ చివరి భాగంలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం, నది ప్రాంతాలలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం వంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే రైలు చివరి భోగి పైకి ఎక్కి సెల్ఫీ దిగడం కోసం చేయి పైకి ఎత్తాడు. ఈ క్రమంలోనే అతని చేయి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో అతను విద్యుత్ ఘాతానికి గురయి కింద పడ్డాడు.అయితే అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

తలకు తీవ్ర గాయం.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..

ఇలా విద్యుత్ ఘాతంతో రైల్వే భోగి నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి అనంతరం అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సరదాగా నడుచుకుంటూ వెళ్లిన ఆ బాలుడు కరెంట్ పోల్ ను తాకాడు.. తర్వాత ఏమైందంటే..

ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనలు జరుగుతాయని మనం అస్సలు ఊహించి ఉండం. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కరెంట్ స్తంభాలను తాకే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఓ కుర్రాడు కరెంట్ స్తంభాన్ని పట్టుకొని అక్కడిక్కడే కూలపడ్డాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి అక్కడే ఉన్న కర్ర సహాయంతో అతడిని బయటకు లాగాడు.

ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సదుల్‌పూర్ తాలూకా నుహంద్ అనే గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అదిల్ అనే ఆరేళ్ల పిల్లాడు తన స్నేహితుడైన మరో బాలుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. సరాదగా మాట్లాడుకుంటూ వస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ కరెంట్ స్తంభాన్ని అందులో ఒక పిల్లాడు పట్టుకున్నాడు.

అది గమనించని మరో బాలుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అటు నుంచి వస్తున్న మరో వ్యక్తి ఆ బాలుడికి కరెంట్ షాక్ తగిలిందని గ్రహించాడు. వెంటనే అతడు పక్కనే ఉన్న ఓ చెక్కను తీసుకొని వచ్చి ముందుగా అతడి చెయ్యిపై కొట్టాడు. ఆ తర్వాత ఆ బాలుడిని పక్కకు గుంజాడు. మరికొంతమంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ వాహనంలో ఎక్కించారు.

అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన అతడిని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. వర్షాకాలంలోనే కాదు.. ఎప్పుడైనా కరెంట్ స్తంభాలను పట్టుకోవడం అనేది మంచిది కాదంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడి శరీరం నుంచి పొగలు రావడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండే ఉండొచ్చు అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.