Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!
Crime: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీల కోసం ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫీ లకు ఫోజులు ఇవ్వడం కోసం ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకొని ప్రాణాలతో చెలగాటం ఆడటం వల్ల ఎన్నో ప్రమాదా సంఘటనలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల బారిన పడి కొంత మంది ప్రాణాలతో బయట పడగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇప్పటికే ఎంతోమంది కొండ చివరి భాగంలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం, నది ప్రాంతాలలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం వంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే రైలు చివరి భోగి పైకి ఎక్కి సెల్ఫీ దిగడం కోసం చేయి పైకి ఎత్తాడు. ఈ క్రమంలోనే అతని చేయి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో అతను విద్యుత్ ఘాతానికి గురయి కింద పడ్డాడు.అయితే అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.
ఇలా విద్యుత్ ఘాతంతో రైల్వే భోగి నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి అనంతరం అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…