Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!
Crime: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీల కోసం ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫీ లకు ఫోజులు ఇవ్వడం కోసం ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకొని ప్రాణాలతో చెలగాటం ఆడటం వల్ల ఎన్నో ప్రమాదా సంఘటనలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల బారిన పడి కొంత మంది ప్రాణాలతో బయట పడగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇప్పటికే ఎంతోమంది కొండ చివరి భాగంలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం, నది ప్రాంతాలలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం వంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే రైలు చివరి భోగి పైకి ఎక్కి సెల్ఫీ దిగడం కోసం చేయి పైకి ఎత్తాడు. ఈ క్రమంలోనే అతని చేయి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో అతను విద్యుత్ ఘాతానికి గురయి కింద పడ్డాడు.అయితే అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.
ఇలా విద్యుత్ ఘాతంతో రైల్వే భోగి నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి అనంతరం అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…