Tag Archives: director parasuram

Sarkaru Vaari Paata: సంచలనంగా మారిన సర్కారు వారి పాట 100 కోట్ల పోస్టర్… ఇందులో నిజమెంత?

Sarkaru Vaari Paata: పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యింది. మొదటి షో తోనే మిశ్రమ స్పందన లభించిన కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ మేకర్స్ కూడా వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 100కోట్ల పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్టర్ పై స్పందిస్తూ మిశ్రమ స్పందన లభించిన ఈ సినిమా వంద కోట్లు రాబట్టడం ఎంత వరకు నిజం? ఈ పోస్టర్ లో నిజం ఎంత ఉంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో $2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పలుచోట్ల కలెక్షన్లు మంచిగానే ఉన్నప్పటికీ ఏకంగా వంద కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఫేక్ కలెక్షన్స్..


ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్టర్ పై స్పందిస్తూ ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఉన్న పోస్టర్లను విడుదల చేస్తూ మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు సినిమా యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఒకే సారి ఇలా 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

Director Parasuram: మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిఖిల్ హీరోగా యువత సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ విధంగా పరశురామ్ దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పరుశురాం వ్యక్తిగత విషయంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ సొంత బాబాయి కుమారుడే పరశురామ్.

Director Parasuram: డైరెక్టర్ పరుశురామ్ తల్లి అలాంటి క్యాన్సర్ తో చనిపోయారని తెలుసా?

పరశురామ్ పుట్టింది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకి దగ్గర్లోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊళ్లో అయినా, పెరిగింది మాత్రం చెర్లోపాలెంలో. తన నాన్న కో ఆపరేటివ్ బ్యాంకులో చిన్న ఉద్యోగిగా పని చేసేవారు తన తల్లి పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను చేసుకునేవారు.ఇలా ఒక రోజు కోళ్లకు వైరస్ సోకి పెద్దమొత్తంలో నష్టాలు వచ్చాయి.

ఆ డబ్బులతో పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని ఆశపడిన తన తల్లి కోరిక నెరవేరలేదు ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లల చదువులు కొనసాగాయి. అలా పరశురాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేశారు. ఇలా ఎంబీఏ చదువుతూనే ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ పని చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఓసారి అమ్మకు ఒంట్లో బాలేదని ఫోన్‌ రావడంతో ఇంటికెళ్లి తన తల్లికి వైద్య పరీక్షలు చేయించారు. దీంతో తనకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పడంతో తన స్నేహితులతో కలిసి రక్తం కూడా ఇచ్చారు.

ఈ విధంగా తన తల్లికి చికిత్స చేయించిన అనంతరం తిరిగి వచ్చిన పరశురామ్ కు మరో పది రోజుల వ్యవధిలోనే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని కబురు రావడంతో పూర్తి స్థాయి పరీక్షలు చేయించిన పరుశురామ్ ఒక చేదు వార్త తెలిసింది.తన తల్లి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని మూడు నెలలకు మించి బతకరని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది.

పూరి జగన్నాథ్ సహాయంతో…

ఈ విధంగా డాక్టర్లు చెప్పడంతో తన తల్లిని హైదరాబాద్ తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించిన చికిత్స స్పందించారు.అయితే ఈ విషయం తెలిసిన ఆమె ఆరు నెలలకు మృతి చెందారు. ఈ విధంగా బ్లడ్ క్యాన్సర్ తో తన తల్లి మృతి చెందడంతో ఉన్న ఆస్తులను అమ్మి తన అక్కకు పెళ్లి చేశారు.ఇక ఈయన కూడా హైదరాబాద్ వచ్చి పూరి జగన్నాథ్ సహాయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.