Tag Archives: Edible oil prices

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

Edible Oil Prices: గత కొన్ని రోజులుగా సామాన్యుడికి వంటనూనెల రేట్లు చుక్కలు చూపెడుతున్నాయి. ఒక లీటర్ నూనె ప్యాకెట్ ధర వంద రూపాయలను మించి పోయింది. దీంతో నూనెల రేట్ల వల్ల సామాన్యుడు చాలా ఇబ్బందలు పడుతున్నాడు. దేశంలో నూనె గింజల సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో పాటు పామాయిల్ ను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో.. నూనెల రేట్లు పెరుగుతున్నాయి. 

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

కాగా తాజాగా సామాన్య ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్రం వంట నూనెల దిగుమతి సుంకాలు తగ్గించడంతో.. ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. క్రూడాయిల్ పామాయిల్ దిగుమతిపై సుంకాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

Good News: సామాన్యుడికి గుడ్ న్యూస్ ..! మరింత దిగిరానున్న వంట నూనెల ధరలు.. !

ఈ నిర్ణయం వల్ల ఇండియాలో పెరుగుతున్న వంట నూనెల ధరలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కేంద్రం ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 8.25 శాతం నుంచి 5.5శాతానికి తగ్గించింది. ఇక ముడివ పామాయిల్ పూ ప్రాథమిక కస్టమ్స్ సుంకం జీరో చేసింది.

క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని …

ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ నోటిఫికేషన్ ద్వారా అగ్రి ఇన్ ఫ్రా డెవలప్మెంట్ సెస్ ని ఫిబ్రవరి 13 నుంచి 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. క్రూడ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాన్ని సెప్టెంబర్ 30 వరకు ఆరు నెలలు పాటు పొడగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక శుద్ది చేసిన పామ్ ఆయిల్ పూ ఇంపోర్ట్ డ్యూటీ 13.75 శాతంగా ఉంది. గత సంవత్సరం నుంచి వంట నూనెల ధరలు దేశంలో అధికంగా ఉన్నాయి. దీన్ని తగ్గించేందుకు దేశీయంగా లభ్యత పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పామాయిల్ పై దిగుమతి సుంకాలను తగ్గించుకుంటూ వస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశీయ రిఫైనరీలు స్వాగతించాయి.

విపరీతంగా పెరుగుతోన్న వంట నూనె ధరలు.. దీనికి కారణం ఏంటంటే..

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అంటూ ఓ సినిమాలో సాంగ్. అలాంటి పరిస్థితే సామన్యుడికి ఎదురవుతుంది. నిత్యావసర వస్తువుల కోసం భయటకు వెళ్తే చాలు.. ఏ వస్తువు ముట్టుకున్నా చుక్కల్లో ధరలు కనపడుతున్నాయి. పెట్రోల్ , డీజిల్ ధరలు ప్రతి నిత్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు ఫామాయిల్ ధరలు కూడా ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరీ విపరీతంగా కాకుండా రోజుకు కొద్ది మొత్తంలో పెరుగుతుంటంతో ఎవరూ గమనించలేనంత ధరకు చేరకుంది ప్రస్తుత ధర.

అమాంతంగా పెరిగిన ధరల తాకిడిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. వంట నూనెల పెరుగుదలపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. కానీ, ధరలు మాత్రం అదుపులోకి రాలేదు. 6 నెలల క్రితం 90 రూపాయలుగా ఉన్న పామాయిల్ ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా 110 నుంచి 180 రూపాయలకు చేరింది. జులైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు ప్రకారం… 2020తో పోల్చితే… వంట నూనెల ధరలు… 52 శాతం పెరిగాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావిస్తూ ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

వంట నూనె ధరలు పెరగడానికి గల కారణం కరోనా అని ప్రస్తావించారు. వేరుశనగ నూనె (Groundnut) ధర గత ఏడాది జులైతో పోల్చితే… ఈ ఏడాది జులై నెలలో 19.24 శాతం పెరిగిందని ఆయన అన్నారు. క్రూడ్ పామాయిల్‌పై పన్నును జూన్ 30 నుంచి 5 శాతం తగ్గించింది అని మంత్రి తెలిపారు. అలాగే… రిఫైన్డ్ పామాయిల్ లేదా పామోలిన్ పై పన్నును 45 శాతం తగ్గించి… 37.5 శాతంగా ఉంచామన్నారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి నామమాత్రంగా ఉండటంతో దాని దిగుమతులకు విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఆవ నూనె 39.03 శాతం పెరిగింది… అలాగే సోయా నూనె 48.07 శాతం పెరిగింది… అలాగే సన్‌ఫ్లవర్ నూనె 51.62 శాతం పెరిగింది. పామాయిల్ 44.42 శాతం పెరిగింది. జులై 27 నాటికి ఈ లెక్కలు ఉన్నాయని మంత్రి తెలిపారు.