Tag Archives: employees

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ ట్యక్స్ మినహాయింపు..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ను వినియోగించుకోలేకపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది.

ఉద్యోగులు 2018 – 2021 సంవత్సరాలకు సంబంధించి సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఉద్యోగులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల నగదు వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అక్టోబర్ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన జీవో జారీ అయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

సాధారణంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ కు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఎల్టీసీ సెలవులను నగదుగా మార్చుకునే వారికి కూడా పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లాడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎల్టీసీ సౌకర్యం పొందే ఇతర ఉద్యోగులకు కూడా కేంద్రం ఇదే తరహా ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం నిబంధంనలకు అనుగుణంగా గరిష్టంగా 36,000 రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయించే అవకాశాలు ఉంటాయని సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు.

ఉద్యోగులకు, వ్యాపారులకు అలర్ట్.. ఐటీ రిటర్న్స్ లో కొత్త నిబంధనలు..

ఆదాయపు పన్ను శాఖ 2020 – 2021 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. నూతన నిబంధనల్లో 50 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించి ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సాధారణ రిటర్న్ ఫామ్ ను ప్రధానంగా స్థిరాస్తుల నుంచి ఆదాయం, వడ్డీ పొందే వాళ్ల కోసం, జీతం మరియు పెన్షన్ తీసుకునే వాళ్ల కోసం రూపొందించింది.

అసెసీ ఆదాయంలో భార్య, మైనర్లు సంపాదించే ఆదాయాన్ని పొందుపరచాలని పేర్కొంది. విదేశాల్లో సైనింగ్ అథారిటీ ఉన్నా, ఇతర కంపెనీల నుంచి వడ్డీని పొందుతున్నా, అన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్లు గతేడాదిలో ఉన్నా సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. గుర్రపు పందేలు, లాటరీలు, వ్యవసాయం నుంచి 5 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందేవారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు.

హౌజ్ ప్రాపర్టీ నుంచి నష్టాలు, ఇతర ప్రాపర్టీల నుంచి నష్టాలు పొందుతున్న వారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. ఎవరైనా కోటి రూపాయల మొత్తాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటినా, ఫారిన్ టూర్ బిల్లు రెండు లక్షల రూపాయలు దాటినా ఫామ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

ఈక్విటీ షేర్ల అమ్మకంతో వచ్చిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను వేరుగా చూపించడంతో పాటు ఏ1, బీ1 క్యాపిటల్ గెయిన్స్ ను కలిపి చూపకుండా విడిగా చూపాల్సి ఉంటుంది. మరోవైపు 2018 – 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్, జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ కు గడువును ఆదాయపు పన్ను శాఖ రెండు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.

పీఎఫ్ డబ్బులు ముందే తీసుకునే వారికి షాకింగ్ న్యూస్..!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. పీఎఫ్ అకౌంట్లు ఉన్నవాళ్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ శాతం వడ్డీ లభిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ అకౌంట్ సర్వీసులను తన సబ్‌స్క్రైబర్లకు అందిస్తోంది. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి వేతనంలో 12 శాతం జమవుతుంది.

 

ఉద్యోగుల వేతనంలో కట్ అయ్యే అమౌంట్ తో పాటు కంపెనీ కూడా అదే మొత్తంలో నగదును ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలకు 8.5 శాతం వడ్డీ లభిస్తుండగా ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్ల సమీక్ష అనంతరం వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీఎఫ్ స్కీమ్ ఒకటని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది.

అయితే ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైతే ముందుగానే పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటి కొనుగోలు, మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి, పిల్లల చదువు కోసం పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డాక్యుమెంట్ ప్రూఫ్స్ ను అందజేయాల్సి ఉంటుంది. అయితే ఎంతో అవసరం అయితే మాత్రమే పీఎఫ్ డబ్బులను మధ్యలో విత్ డ్రా చేసుకోవడం మంచిది. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

ఎవరైతే నిర్ణీత సమయం కంటే ముందుగానే పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకుంటారో వారికి రిటైర్మెంట్ సమయానికి చాలా తక్కువ మొత్తం మాత్రమే లభిస్తుంది. ఐదు సంవత్సరాల సర్వీస్ కంటే ముందే పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకుంటే అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత కాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ ను కోల్పోయే అవకాశం ఉంటుంది.