Featured

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ ట్యక్స్ మినహాయింపు..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ను వినియోగించుకోలేకపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది.

ఉద్యోగులు 2018 – 2021 సంవత్సరాలకు సంబంధించి సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఉద్యోగులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల నగదు వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అక్టోబర్ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన జీవో జారీ అయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

సాధారణంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ కు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఎల్టీసీ సెలవులను నగదుగా మార్చుకునే వారికి కూడా పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లాడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎల్టీసీ సౌకర్యం పొందే ఇతర ఉద్యోగులకు కూడా కేంద్రం ఇదే తరహా ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం నిబంధంనలకు అనుగుణంగా గరిష్టంగా 36,000 రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయించే అవకాశాలు ఉంటాయని సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago