దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ను వినియోగించుకోలేకపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది.
ఉద్యోగులు 2018 – 2021 సంవత్సరాలకు సంబంధించి సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఉద్యోగులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల నగదు వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అక్టోబర్ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన జీవో జారీ అయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.
సాధారణంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ కు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఎల్టీసీ సెలవులను నగదుగా మార్చుకునే వారికి కూడా పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లాడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎల్టీసీ సౌకర్యం పొందే ఇతర ఉద్యోగులకు కూడా కేంద్రం ఇదే తరహా ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం నిబంధంనలకు అనుగుణంగా గరిష్టంగా 36,000 రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయించే అవకాశాలు ఉంటాయని సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…