డైరెక్టర్ కృష్ణవంశీ తాను తీసిన సినిమా తర్వాత జయాపజయాలతో నిమిత్తం లేకుండా గోదావరి నదిపై లాంచీలో ప్రయాణిస్తూ.. చుట్టూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ తను ఇంతకుముందు పడిన కష్టం మొత్తం మర్చిపోతూ ఉంటాడు. ఆ క్రమంలో తన స్నేహితుల మధ్య రాజేవ్ గాంధీ హత్య గురించి సంభాషిస్తూ ఫిరోజ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా ఏమిటి అని అడగగా అందులో ఉన్న ఆయుర్వేద డాక్టర్ ఆ కుటుంబానికి శాపం ఉందని చెప్పారు. శాపమా..? అని కృష్ణవంశీ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మరో స్నేహితుడు… ఆంధ్రాలో ఒక పేరున్న వ్యక్తి తన పాలేరును ఒకసారి కొట్టడం జరిగింది. ఆ బాధతో పాలేరు ఆ కుటుంబానికి శాపం పెట్టాడు. ఆ యజమాని పెద్ద కొడుకు పొలంలో ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. అతని కర్మకాండలు పూర్తిచేసి వస్తూ రెండవ కొడుకు రైల్వే ట్రాక్ వద్ద యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇలా కృష్ణవంశీ మనసులో ఆ విషయాలన్నీ ఒక్కసారిగా మెదిలాయి.
అయితే నందిగాం రామలింగేశ్వర రావు సూపర్ స్టార్ కృష్ణ కి వీరాభిమాని ఆయనతో కంచు కాగడా, కిరాయి కోటిగాడు లాంటి హిట్ సినిమాలు తీయడం జరిగింది.మళ్లీ కృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తీయాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన కృష్ణవంశీని కలిశారు. మహేష్ బాబు బృందావనం లో శ్రీ కృష్ణుని లా ఉంటాడు. అలాంటి ఆయనకి మురారి లాంటి కథ అయితే బాగుంటుందని కృష్ణవంశీ ఆలోచించాడు. బృందావనంలో కృష్ణుడు, ఓ కుటుంబానికి ఉన్న శాపం ఈ రెండింటితో ఒక అద్భుతమైన కథను కృష్ణవంశీ అళ్ళాడు. పద్మాలయ ఆఫీసులో కృష్ణ, మహేష్ బాబు, రామలింగేశ్వరరావుకు కృష్ణవంశీ ఆ కథ చెప్పాడు.
కృష్ణ గారు లేచి స్టోరీ బావుంది కానీ కన్ఫ్యూజన్ గా ఉంది. మహేష్ బాబు, కృష్ణవంశీ ఇష్టం అని ఆయన వెళ్లిపోయారు. మళ్లీ కథ విన్న రామలింగేశ్వరరావు వేరే ఏదైనా ప్రేమ కథ చిత్రం ఉంటే చెప్పండి అన్నారు ఇద్దరు హీరోయిన్లతో కూడిన ఒక మంచి ప్రేమ కథ చిత్రం ఉంది అని కృష్ణవంశీ చెప్పారు. కానీ మురారి కథ తో సినిమా తీస్తే ఇరవై సంవత్సరాలు సినిమాను గుర్తు చేసుకుంటారు. కానీ ప్రేమ కథతో సినిమా తీస్తే వెంబడే మర్చిపోతారని కృష్ణవంశీ చెప్పడం జరిగింది. చివరికి చేసేది లేక రామలింగేశ్వరరావు మురారి కథను ఓకే చేశారు. స్టోరీ డెవలప్ కోసం భాగవతం, భారతం అందులోని శ్రీ కృష్ణుడు, యశోద పాండవులు వీటన్నిటిని కృష్ణవంశీ కూలంకశంగా చదివాడు. కొన్ని సందేహాలు వస్తే తన గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గరికి వెళ్లి నివృత్తి చేసుకున్నాడు.
మహేష్ బాబు సరసన హీరోయిన్ కోసం ముంబై వెళ్లారు. హేమమాలిని కూతురు ఈషాడియోల్ ను అడిగారు. హేమమాలిని డైరెక్టుగా రెమ్యూనరేషన్ ఎంతిస్తారని అడిగేశారు. తర్వాత హైదరాబాదులో లో ఒక పెళ్ళికి సోనాలి బింద్రే హాజరయ్యారు. అక్కడ ఆమెకు మురారి కథ చెప్పగా నచ్చడంతో ఈ సినిమాకి సోనాలి బింద్రే ను ఎంపిక చేసుకున్నారు. ముందుగా “ముకుంద కృష్ణ మురారి” అని టైటిల్ పెడదామనుకున్నారు. కానీ నిర్మాత సింపుల్ గా మురారి అని టైటిల్ పెడితే బాగుంటుందని ఆ టైటిల్ నే ఖరారు చేయడం జరిగింది. అలా మురారి సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…