దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ నెల 22వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామరాజు ఫర్ భీమ్ టీజర్ విడుదల కాగా ఆ టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపించడంపై వివాదం తలెత్తింది. రాజమౌళి తెరకెక్కించిన గత సినిమాల్లోని కొన్ని సీన్లు సైతం వివాదాల పాలవగా అప్పట్లో ఆ వివాదాలను రాజమౌళి పరిష్కరించుకున్నారు. అయితే ఎన్టీఆర్ టోపీ పెట్టుకున్న వివాదం గురించి మాత్రం ఇప్పటివరకు రాజమౌళి స్పందించలేదు.
సినిమా కథలో భాగంగా కొంతకాలం ఎన్టీఆర్ అజ్ఞాతవాసం ఉంటారని అందువల్లే ఆ సమయంలో టోపీ ధరిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ భీమ్ కు టోపీ పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి గుణపాఠం తప్పదని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైతే బరిగలతో కొట్టి చంపుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళికి దమ్ముంటే ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింకు కాషాయ కండువా వేసి సినిమా తీయాలని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…