ఆదాయపు పన్ను శాఖ 2020 – 2021 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ల కోసం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. నూతన నిబంధనల్లో 50 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించి ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ సాధారణ రిటర్న్ ఫామ్ ను ప్రధానంగా స్థిరాస్తుల నుంచి ఆదాయం, వడ్డీ పొందే వాళ్ల కోసం, జీతం మరియు పెన్షన్ తీసుకునే వాళ్ల కోసం రూపొందించింది.
అసెసీ ఆదాయంలో భార్య, మైనర్లు సంపాదించే ఆదాయాన్ని పొందుపరచాలని పేర్కొంది. విదేశాల్లో సైనింగ్ అథారిటీ ఉన్నా, ఇతర కంపెనీల నుంచి వడ్డీని పొందుతున్నా, అన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్లు గతేడాదిలో ఉన్నా సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. గుర్రపు పందేలు, లాటరీలు, వ్యవసాయం నుంచి 5 వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందేవారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు.
హౌజ్ ప్రాపర్టీ నుంచి నష్టాలు, ఇతర ప్రాపర్టీల నుంచి నష్టాలు పొందుతున్న వారు సైతం సాధారణ రిటర్న్ ఫామ్ ను ఉపయోగించరాదు. ఎవరైనా కోటి రూపాయల మొత్తాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లు లక్ష రూపాయలు దాటినా, ఫారిన్ టూర్ బిల్లు రెండు లక్షల రూపాయలు దాటినా ఫామ్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.
ఈక్విటీ షేర్ల అమ్మకంతో వచ్చిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను వేరుగా చూపించడంతో పాటు ఏ1, బీ1 క్యాపిటల్ గెయిన్స్ ను కలిపి చూపకుండా విడిగా చూపాల్సి ఉంటుంది. మరోవైపు 2018 – 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్, జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ కు గడువును ఆదాయపు పన్ను శాఖ రెండు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాధారణంగా భావిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే…
వేసవి కాలం వచ్చేసరికి పెద్దలకే కాదు, చిన్నారులకు కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా శిశువులు, టాడ్లర్స్ సున్నితమైన చర్మం…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా అధికమవుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్లో ఉంచినప్పటికీ…
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…
వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…