Tag Archives: Etela Rajendar

గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం_ మంత్రి హరీష్ రావు

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీష్ రావ్. కుక్కర్లో కుట్టు మిషను గడియారాలు పంచినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి వెల్లడించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్ అని హరీశ్ రావు తెలిపారు.

దళిత బంధు కోసల్లే ప్రోగ్రాం కాదు_ ఈటల రాజేందర్

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర పనులకు ఒడిగడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పథకాలన్నీ నా వల్లే వస్తున్నాయని.. నాకే ఓటేస్తామని హుజరాబాద్ ప్రజలు అంటున్నారని ఈటెల స్పష్టం చేశారు.

కాగా హుజురాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు ఈటెల. కేసిఆర్ ఎప్పుడు ఓట్ల కోణంలోనే ఆలోచిస్తారని.. ప్రజల కోణంలో ఆలోచించరని ధ్వజ మెత్తారు. సొంత పార్టీ నేతలను వెలకట్టే నీచానికి కేసీఆర్ దిగజారారని అన్నారు. అక్రమ సంపాదన ప్రభుత్వ ధనంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది తానేనని ఈటెల పేర్కొన్నారు.

ఈటెల రాజేందర్ పై ఫైర్ అయిన తలసాని!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి పట్టిన గతే రాజేందర్ కి పడుతుందన్నారు. గెల్లు శ్రీనివాస్ ని బానిసగా పేర్కొనడం ఈటెల అహంకారానికి నిదర్శమన్నారు.

హుజురాబద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఈటెలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే శ్రీనివాస్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు.

బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు కోసం పోరాడే వ్యక్తి కావాలా?_ఈటెల

ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో విజయం తనదే అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ కి బానిసేనని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఈటెల పేర్కొన్నారు.

కాగా ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఈటెల ఆరోపించారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెల్లు గెలుపు ఖాయం_ మంత్రి హరీష్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బిజెపి మధ్యే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో మంత్రి మాట్లాడారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీశ్ అన్నారు. ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరారన్నారు . నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం అని హరీశ్ పేర్కొన్నారు.

హుజరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీశ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మరో రెండేళ్లు ఉండేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని.. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ప్రజలంతా టిఆర్ఎస్ ని గెలిపించాలని హరీష్ కోరారు.