Tag Archives: Europe

మరోసారి పంజా విసురుతున్న కరోనా.. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని గడగడలాడించిన వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం నలుమూలలా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ వైరస్ పుట్టి రెండేళ్లు దాటుతున్న కూడా ఇంకా కరోనా కేసులు తగ్గడం లేదు. కొన్ని దేశాలలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న, మరికొన్ని దేశాలలో అంతకంతకు విజృంభిస్తోంది.

యూరోప్ దేశాల్లో ఈ వైరస్ రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ విజృంభిస్తుంది.ఈ క్రమంలోనే యూరోప్ లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించగా వచ్చే వసంత కాలం నాటికి కరోనా ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని who సంస్థ యూరప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌లుగే హెచ్చరించారు.

ఈ విషయం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని యూరోప్ లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.ఇప్పటికే యూరోపియన్‌ దేశాల్లో అనేక ప్రాంతంలో 1బిలియన్‌ కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.యూరప్, మధ్య ఆసియా ప్రాంతాలలో కోవిడ్ కల్లోలం చాలా తీవ్రంగా ఉంది.

అంతేకాదు శీతాకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాలు, ఆరోగ్య అధికారులు, వ్యక్తులు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చర్య తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ క్లూగే అన్నారు. గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్‌ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వీటితో పాటుగా పలు దేశాలలో కరోనా మహమ్మారి కేసులు మరింత రెట్టింపు అయినట్లు తెలిపారు.

ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరోసారి లాక్ డౌన్..?

గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లో గతంలో కఠినంగా లాక్ డౌన్ అమలైందని.. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. పరిస్థితులు ఇలాగే ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో డబ్లూహెచ్వో వరల్డ్ హెల్త్ అసెంబ్లీని నిర్వహించింది.

ఈ సమావేశం అనంతరం వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు చేసింది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో లేకపోవడంతో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పలు దేశాలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. భారత్ సహా పలు దేశాలకు కరోనా ముప్పు ఉందని కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ అదుపులోకి వచ్చినట్టు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.