గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లో గతంలో కఠినంగా లాక్ డౌన్ అమలైందని.. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. పరిస్థితులు ఇలాగే ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో డబ్లూహెచ్వో వరల్డ్ హెల్త్ అసెంబ్లీని నిర్వహించింది.
ఈ సమావేశం అనంతరం వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు చేసింది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో లేకపోవడంతో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పలు దేశాలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. భారత్ సహా పలు దేశాలకు కరోనా ముప్పు ఉందని కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ అదుపులోకి వచ్చినట్టు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…