Tag Archives: Fisherman

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

Case On Fish: ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడిని చేప చంపేసింది. వినడానికి వింతగా ఇన్నా ఇదే నిజం. ఈ చేపపై పోలీసులు కేసు కూడా పెట్టడం మరో సంచలనంగా మారింది. ఏన్నో ఏళ్లుగా వేటకు వెళ్తున్న ఇటువంటి సంఘటన ఎదురుకాలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

ఈ ఘటన విశాఖ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. సముద్రంలో ఉండే కొమ్ము చేప మహా డేంజరెస్. అలాంటి చేప దాడిలోనే మత్స్యకారుడు మరణించాడు. ఈ చేపపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎటాంటి చర్య తీసుకుంటారో అని ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం చేపపై హత్యా నేరం నమోదు చేశారు విశాఖ పరవాడ పోలీసులు. 

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

మనుషులపై దాడి చేసి తన పదునై కమ్ముతో చంపేయడం కొమ్ము చేప ప్రత్యేకత. ఇది విశాఖకు దాదాపు ఎనబై నాటికల్ మైళ్ల దూరంలోనే ఈ కొమ్ము చేపలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయనే వార్తలు ప్రస్తుతం మత్స్యకారులను కలవరపెడుతోంది. 


జోగన్న అక్కడే మరణించాడని..

అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై వేటకు వెళ్లిన మిగతా మత్స్యకారులు  వివరాలు వెల్లడించారు. విశాఖ పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్య్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపల కోసం వల వేశారు. మరసటి రోజు ఉదయం 8 గంటలకు వలలో పెద్దచేపలు చిక్కాయి. ఆ సమయంలో వలను పైకి లాగే ప్రయత్నం చేశారు. బరువు చాలా ఎక్కువగా ఉండటంతో మత్య్సకారులకు కష్టమైంది. ఈ సమయంలోనే వల పడవకు చిక్కుకుంటే చిరిగే అవకాశం ఉండటంతో జోగన్న అనే మత్స్యకారుడు నీటిలోకి దిగాడు. ఈ సమయంలోనే కొమ్ముకోనెం చేప జొగన్న డొక్కలో తన ముక్కుతో పొడించింది. తీవ్రగాయం అయిన జోగన్న అక్కడే మరణించాడని తోటి మత్స్యకారులు తెలిపారు. ఈ ఘటనను విచారించిన పోలీసులు.. తోటి మత్స్యకారులను కూడా విచారించి కోమ్ముకోనెం చేపే జోగన్నను చంపిందని నిర్థారణకు వచ్చారు. చేపపై కేసు నమోదుచేశారు. జోగన్న మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ హించారు. మత్య్సకారులతో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు సమావేశం నిర్వహించారు. కనీసం రక్షణ లేకుండా సముద్రంలోకి ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీ వర్షాల కారణంగా.. మునిగిన 12 పడవలు.. 11 మంది గల్లంతు..!

దక్షిణ గుజరాత్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో.. గిర్-సోమ్‌నాథ్ సమీపంలోని అరేబియా సముద్రంలో బలమైన గాలులు తలెత్తాయి. 12 మత్స్యకారులకు సంబంధించి పడవలు మునిగిపోయాయి. ఈ పడవల్లో 23 మంది మత్స్యకారులు ఉండగా.. వారిలో 11 మంది గల్లంతయ్యారు.

మత్స్యకారుల జాడ కోసం అధికారులు నేవీ సహాయం తీసుకున్నారు. అదే సమయంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు ముందుగానే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఎక్కువ దూరం చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులను ముఖ్యంగా హెచ్చరించారు. అయితే వాళ్లు చెప్పిన విధంగానే ఎక్కువ దూరం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు తమ పడవలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ 12 పడవలు మాత్రం ముందుగానే ఒడ్డుకు చేరుకోలే పోయారు.

దీంతో ఎవరూ ఊహించని విధంగా అలలు ఎక్కువగా కావడంతో.. వాళ్లు ఆ అలల్లో చిక్కుకుపోయారు. వాళ్ల జాడ కోసం అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ గుజరాత్ లో వర్షం కారణంగా ఒకే రోజులో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. డయ్యూలో కూడా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అక్కడ ఓ పడవ మునిగిపోవడంతో ఒక మత్స్యకారుడు మరణించాడు.

జాలరికి తగిలిన జాక్ పాట్.. ఏకంగా చేప కడుపులో అది చూసి ఆశ్చర్యపోయిన జాలరి?

సాధారణంగా వేటకు వెళ్లే జాలర్లకు రోజు ఎన్నో విచిత్ర సంఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి వేటలో చేపలు పడక నిరాశతో వెను తిరిగి వస్తుంటే మరోసారి అనుకోకుండా వారికి వివిధ రూపాలలో అదృష్టం వరిస్తుంది. ఇలాంటి అదృష్టం తన్నుకొచ్చినప్పుడు జాలర్లు సంతోషానికి అవధులు ఉండవు. తాజాగా ఇలాంటి అద్భుతమైన ఘటన ఓ జాలరికి దక్కింది.

ఎప్పుడూలాగే వేటకు వెళ్ళిన ఆ జాలరికి ఓ భారీ చేప పడటంతో ఎంతో సంతోషంగా దానిని బయటకు లాగాడు. ఆ సంతోషంలోనే జాలరి చేపలను కట్ చేస్తుండగా ఒక చేపలో అతనికి ఏదో గట్టిగా ఉన్నట్లు గమనించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడు ఆ చేపను కట్ చేసి చూస్తే అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం బయటపడింది.

ఆ చేప కడుపులో ఓపెన్ చేయనీ ఒక మద్యం బాటిల్ కనిపించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం మనుషులు చేసే పనుల వల్ల ఎన్నో మూగజీవాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పడానికి ఇదొక మంచి నిదర్శనమని కామెంట్లు చేయగా, మరికొందరు మనుషుల బాధ్యతారహిత ప్రవర్తనకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని జంతు ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం  ‘జాక్‌పాట్‌ కొట్టావ్‌.. క్యాచ్‌ ఆఫ్‌ ది డే’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు.