Tag Archives: gold jewellery

Siddharth Varma: భార్య పుట్టిన రోజున లక్షల రూపాయిలతో బంగారం గిఫ్ట్ గా ఇచ్చిన బుల్లితెర నటుడు… వైరల్ అవుతున్న వీడియో!

Siddharth Varma: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలు పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులుగా గుర్తింపు పొందిన సిద్ధార్థ వర్మ విష్ణు ప్రియ పలు సీరియల్స్ లో నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి విష్ణు ప్రియ పుట్టిన రోజు కావడంతో తన భర్త తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా షాపింగ్ వెళ్ళిన విష్ణు ప్రియ తనకు నచ్చినటువంటి బంగారు నగలను కొనుగోలు చేశారు.ఈ విధంగా తనకు నచ్చిన గాజులు నెక్లెస్ ఇయర్ రింగ్స్ అన్ని కొనుగోలు చేసిన ఈమె బిల్లు మాత్రం తన భర్త చేత కట్టించారు.

ఈ విధంగా తాను కొన్న నగలను సుమారు 200 గ్రాములకు పైగా ఉన్నాయని తెలియజేస్తూ వాటికి డబ్బులను మాత్రం తన భర్త సిద్ధార్థ వర్మ చేత కట్టించి తన పుట్టినరోజు కానుకగా తన భర్త తనకు బంగారు నగలు కొనిచ్చారంటూ ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ విధంగా విష్ణు ప్రియ ఈ వీడియోని షేర్ చేస్తూ నా బర్తడే కు మా వారి బంగారు కానుక అంటూ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

Siddharth Varma: ప్రేమించి సిద్ధార్థ వర్మను పెళ్లి చేసుకున్న విష్ణు ప్రియ..

ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈమె ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మల్లికా పాత్రలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సీరియల్స్ లో నటిస్తూనే నటుడు సిద్ధార్థ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా చేస్తే మీ నగలు ఎప్పటికీ మెరిసిపోతాయ్!

ఆడవారి అందాన్ని రెట్టింపు చేసేది నగలు మాత్రమే. ఎంతో అందంగా ముస్తాబైనప్పటికీ మెడలో నగలు లేకపోతే ఏదో పోయినట్టు ఉంటుంది. అందుకే మహిళలు ఎక్కువగా నగలను కొనడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మార్కెట్లోకి వచ్చే వివిధ రకాల డిజైన్లను వారి అభిరుచికి తగ్గట్టుగా కొంటూ ఉంటారు. అయితే ఈ విధంగా కొన్న నగల పట్ల మనం శ్రద్ధ చూపకపోతే అవి తొందరగా పాడవుతాయి. ఎంత ఖరీదు చేసి కొన్న నగలు పాడైతే మనకు చాలా బాధ కలుగుతుంది. ఈ క్రమంలోనే మన నగలు పాడవకుండా ఎప్పటికీ కొత్తవాటిలా మెరిసిపోవాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

మనం ఏదైనా కార్యానీకి వెళ్తున్నప్పుడు అందంగా నగలు ధరించి వెళ్తాము. అయితే ఈవెంట్ ని బట్టి నగలను ఎంపిక చేసుకోవాలి.మనం ఏదైనా శుభకార్యానికి ముస్తాబవుతున్న అప్పుడు ముందుగా మేకప్ వేసుకున్న తరువాత చివరికి నగలను ధరించాలి. ముందుగా మనం మేకప్ వేసుకుని మేకప్ ఆరనివ్వాలి.లేదంటే మేకప్ లో ఉపయోగించే కొన్ని రసాయనాలు బంగారు నగలకు తగలడం ద్వారా నగలు రంగు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టిన నగలను ఎలా పడితే అలా కాకుండా.. కాటన్ లో లేదా టిష్యూ పేపర్ లో పెట్టి ఒక బాక్స్ లో భద్రపరచుకోవాలి. ఈ విధంగా భద్రపరచుకున్నప్పుడు ఎటువంటి దుమ్ము ధూళి నగలపై చేరకుండా ఎంతో కొత్తవిగా మెరిసిపోతాయి. అదేవిధంగా నగలపై దుమ్ము ధూళి చేరినప్పుడు మనం వాటిపై అధిక ఒత్తిడిని కలుగజేసి శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే నగలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

మనకు మన బంగారు నగలను శుభ్రం చేయడం తెలియకపోతే ఒకసారి మనం నగలు కొన్న షాప్ వారి సలహా తీసుకొని నగలను శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా నగలను ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశాలలో ఉంచకూడదు. ఈ విధంగా నగల పట్ల తరచూ జాగ్రత్తలు తీసుకుంటే మన నగలు ఎప్పుడు కొత్త వాటిలా మెరిసి పోతుంటాయి.

అదిరిపోయే ఆఫర్: బంగారం కొనేవారికి ఇప్పుడు ఏకంగా 55 శాతం తగ్గింపు!

బంగారం కొనాలని ఎవరికైతే ఉండదు చెప్పండి. బంగారం కొనాలి ఉన్న ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. అయితే బంగారం కొనాలనే ఆలోచన చేసే వారికి ఇదొక మంచి అవకాశం. బంగారం కొనేవారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.కళ్యాణ్ జువెలర్స్‌కు చెందిన కాండెరే కస్టమర్లు పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ ద్వారా బంగారం, వజ్రాభరణాలు కొనేవారికి ఎంతో బెనిఫిట్ కలిగనుంది. ఈ ఆఫర్ ద్వారా పలు రకాల నగలపై భారీ తగ్గింపును అందిస్తోంది.

డైమండ్ ధరలపై కళ్యాణ్ జ్యువెలర్స్ అదనంగా 25 శాతం తగ్గిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసుకున్న వస్తువులపై అదనంగా 35 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు ఇక బంగారు నగల విషయానికి వస్తే ఆభరణాలు తయారీ చార్జీలలో ఏకంగా 50 శాంతం తగ్గింపునకు అందుబాటులో ఉంచింది. వెండి వస్తువులపై 55% తగ్గింపు ఇవ్వగా, ప్లాటినమ్ ఆభరణాలపై 30శాతం తగ్గింపు అందుబాటులో వచ్చింది.

బంగారు, డైమండ్ ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇకపోతే సోమవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం నాటికి బంగారు ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు తగ్గి రూ.48,650కు క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయలు తగ్గి రూ.44,590 లకు చేరుకుంది.ఈ విధంగా పతనమైన బంగారం రేట్లతో కళ్యాణ్ జ్యువెలర్స్ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ ద్వారా ఎంతో విలువైన బంగారం మీ సొంతం చేసుకోవచ్చు.

బంగారం కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ డాక్యుమెంట్లు ఉంటేనే కొనుగోలు చేసే ఛాన్స్..?

ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే పండుగ సమయాల్లో, పెళ్లి సమయాల్లో ఎక్కువగా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. సాధారణంగా డబ్బులు చెల్లించి ఎవరైనా బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని.. ఇకపై కేవైసీ డాక్యుమెంట్లు ఉంటే మాత్రమే బంగారం కొనుగోలు చేసేలా నిబంధనలు రానున్నాయని తెలుస్తోంది.

ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం ఇకపై బంగారం కొనుగోలు చేయాలని వెళ్లేవాళ్లు తమతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు రూపంలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు తప్పనిసరిగా కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇప్పటికే జువెలరీ రంగానికి మనీ లాండరింగ్ చట్టాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఇకపై బంగారానికి సైతం కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలని నియమనిబంధనలను అమలులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యువెలరీ సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు జరిపితే ప్రభుత్వ కంపెనీలు వివరణ కోరే అవకాశాలు ఉంటాయి. అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పలు జ్యువెలరీ సంస్థలు కేవైసీ డాక్యుమెంట్లను కోరుతున్నాయని తెలుస్తోంది.

2 లక్షల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసినా బంగారం కొనుగోలు చేసిన వాళ్లు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రం నిబంధనల వల్ల కొనుగోలుదారులు సైతం కేవైసీ డాక్యుమెంట్ల విషయంలో గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల సమయంలో బంగారం కొనుగోళ్లకు కేవైసీ డాక్యుమెంట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.